Studio18 News - TELANGANA / HYDERABAD : కొండాపూర్, ఫిబ్రవరి 3 : నడుస్తున్న ద్విచక్ర వాహనంలో(Bike) ఒక్కసారిగా మంటలు చెలరేగిన సంఘటన మాదాపూర్లోని కేబుల్ బ్రిడ్జిపై(Cable bridge) చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..రోడ్ నెంబర్ 45 వైపు నుంచి ఐకియా వైపు తన ద్విచక్ర వాహనం(పల్సర్) పై వెళ్తున్న కొమనంతల జతిన్ కేబుల్ బ్రిడ్జి పైకి రాగానే ఒక్కసారిగి మంటలు చెలరేగాయి. గమనించిన జతిన్ బైక్ ను పక్కన ఆపడంతో ప్రమాదం తప్పింది. కాగా మంటల్లో బైక్ పూర్తిగా దగ్ధమైంది. అటుగా రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.
Admin
Studio18 News