Monday, 08 December 2025 03:56:01 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

తిరుమల లడ్డూ వివాదం.. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా?: మాధవీ లత

Date : 20 September 2024 05:29 PM Views : 320

Studio18 News - TELANGANA / : Madhavi Latha: కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారని టీడీపీ చెప్పిన వివరాలపై బీజేపీ తెలంగాణ నాయకురాలు మాధవీలత స్పందించారు. ఇవాళ ఆమె 10 టీవీతో మాట్లాడుతూ.. తిరుపతి లడ్డూ అంశంపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతిలో జరిగింది చిన్న విషయం కాదని మాధవి లత అన్నారు. కేవలం లడ్డు పైనే కాకుండా మొత్తం శ్రీవారి ఆస్తులపై విచారణ జరగాలని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి 100 రోజుల పాలనపై డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని జగన్ అంటున్నారని చెప్పారు. మరి జగన్ హయాంలో జరిగిన సంఘటనల గురించి ఏం మాట్లాడుతారని నిలదీశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి జగన్ వరకు అక్కడ అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. అన్యమతస్తులను ఏడోమెంట్ లో చేర్చడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువతే ఒక్కటిగా బయటకు వస్తున్నాయని చెప్పారు. లడ్డూ అంశంతో వైసీపీ అరాచకలను బయట పెట్టారని అన్నారు. ఇది ఇంతటితో ఆగవద్దని, శ్రీవారి మొత్తం అస్తులపైనా విచారణ జరగాలని చెప్పారు. దానిపై అందరం కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :