Friday, 14 February 2025 08:27:15 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

#nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి

Date : 24 January 2025 06:29 PM Views : 101

Studio18 News - TELANGANA / NAGARKURNOOL : నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలో ఇటివల నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కూచకుల్ల రాజేష్ రెడ్డి మాట్లాడిన మాటలను ప్రతిపక్షాలతో పాటూ సోషల్ మీడియా మరియు పలు మీడియాల్లో కల్పిత వార్తలుగా చూపిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కొండ నాగేష్ తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే పథకాలు చేరుతాయంటూ ఆయన ధోరణిలో మాట్లాడగా .. ప్రతిపక్ష నాయకులు రెండు రోజుల తర్వాత ఆయన మాట్లాడిన మాటలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలు గతంలో ఏమి వెలుగబెట్టారు.. కనీసం ఏ గ్రామంలో అయినా 10 ఇండ్లైనా లబ్ధీదారులకు ఇచ్చారా.. ! ఎస్సీ బంధు, బీసీ బంధు అని పథకాలు తెచ్చి లబ్ధి చేకూరిన పేదవారు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆరు పథకాల అమలు విషయంలో అహర్నిశలు కృషి చేస్తూ తన గౌరవమైన వృత్తిని కూడా వదులుకొని ప్రజాసేవలో నిమగ్నమయ్యారని.. అలాంటి ఆయనపై వ్యతిరేక ప్రచారాలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కృషి చేస్తూ .. ప్రతిపక్ష పార్టీ అయినా ఆపద అని వచ్చిన ప్రతి ఒక్క పేదవారికి ఎల్వోసీ కానీ కళ్యాణ లక్ష్మి గాని షాదీ ముబారక్ వంటి విషయాలలో తన మన అని తేడా లేకుండా అందరికీ సహకరిస్తున్న నేతగా రాజేష్ రెడ్డిని అభివర్ణించారు. ప్రతిపక్షాలు ప్రాంత అభివృద్ధికి సహకరించాలి కానీ ఇలాంటి దుష్ప్రచారాలను చేయడం సరికాదని, ఇక మీదట ఇలాగే జరిగితే సహించేది లేదంటూ హెచ్చరించారు. ఇప్పటికైన అవాస్తవాలను ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :