Monday, 08 December 2025 03:56:35 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Bala Bharosa Scheme: తెలంగాణలో 'బాల భరోసా'.. చిన్నారుల కోసం సరికొత్త పథకం

Date : 13 November 2025 07:11 PM Views : 179

Studio18 News - TELANGANA / HYDERABAD : ఐదేళ్లలోపు చిన్నారుల కోసం 'బాల భరోసా' పథకం రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మంది చిన్నారులకు ఉచిత వైద్య సేవలు వివిధ అనారోగ్య సమస్యలకు శస్త్రచికిత్సలు సహా పూర్తిస్థాయి చికిత్స ఆరోగ్యశ్రీ, సీఎం సహాయ నిధికి ఈ పథకం అనుసంధానం వైద్య, శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో పథకం అమలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలోని ఐదేళ్లలోపు చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా 'బాల భరోసా' అనే సరికొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్నారులకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని చిన్నారుల ఆరోగ్య స్థితిగతులపై ఇటీవల అంగన్‌వాడీ సిబ్బంది ద్వారా ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సుమారు 8 లక్షల మంది చిన్నారులు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. వీరిలో కొందరు రక్తహీనత, పోషకాహార లోపంతో బాధపడుతుండగా, మరికొందరు వినికిడి, దృష్టి లోపాలు, వయసుకు తగిన ఎదుగుదల లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలా గుర్తించిన చిన్నారులందరికీ అండగా నిలిచేందుకే ప్రభుత్వం 'బాల భరోసా' పథకాన్ని రూపొందించింది. ఈ పథకం కింద వైకల్యంతో బాధపడే చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. వినికిడి లోపం ఉన్నవారికి అవసరమైన పరికరాలను అందిస్తారు. దీంతో పాటు ఇతర వైద్య సేవలను కూడా పూర్తిగా ఉచితంగా కల్పిస్తారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు సంయుక్తంగా ఈ పథకాన్ని పర్యవేక్షించనున్నాయి. 'బాల భరోసా' పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం దీనిని ఆరోగ్యశ్రీకి అనుసంధానించాలని నిర్ణయించింది. ఒకవేళ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వ్యాధులుంటే, వాటి చికిత్స ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమాన్ని (ఆర్‌బీఎస్‌కే) కూడా ఈ పథకంలో విలీనం చేయనున్నారు. ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు తెలంగాణ సర్కార్ ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా ప్రతి చిన్నారి వైద్య చరిత్ర, వారికి అందిస్తున్న చికిత్స, దాని పురోగతిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తారు. ఈ బృహత్తర పథకం విజయవంతమైతే, రాష్ట్రంలోని లక్షలాది మంది చిన్నారులకు చిన్న వయసులోనే మెరుగైన వైద్యం అంది, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి బలమైన పునాది పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :