Sunday, 29 March 2026 03:16:12 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

మణుగూరులో లారీల చక్రబంధం—గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌తో వాహనదారుల అవస్థలు

Date : 28 March 2026 10:48 PM Views : 9

Studio18 News - TELANGANA / HYDERABAD : నిలిచిన లారీల కారణంగా మణుగూరులో ప్రయాణం నరకప్రాయంగా మారింది. మణుగూరులో లారీల చక్రబంధంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మణుగూరు సీఎస్‌పీ నుంచి విజయనగరం వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గంటల తరబడి వాహనదారులు వేచి ఉండగా, పోలీసులు రంగంలోకి దిగారు. ట్రాఫిక్‌ను ఎస్సై నగేష్ కుమార్ క్లియర్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మార్చి 28: మణుగూరు ప్రధాన రహదారిపై శనివారం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇసుక, బొగ్గు లారీలు ఇష్టానుసారంగా రోడ్డుపై నిలిపివేయడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మణుగూరు సీఎస్‌పీ పాయింట్ నుంచి విజయనగరం వరకు రహదారి అంతా లారీలతో నిండిపోవడంతో ఇతర వాహనాలు కదలలేని పరిస్థితి ఏర్పడింది. బొగ్గు రవాణా లారీలు, ఇసుక వాహనాలు క్రమపద్ధతి లేకుండా నిలిపివేయడం వల్ల ఆర్టీసీ బస్సులు, ద్విచక్ర వాహనాలు, అత్యవసర వాహనాలు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. ఈ సమస్యపై వాహనదారులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, లారీల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న మణుగూరు ఎస్సై నగేష్ కుమార్ వెంటనే స్పందించి, కానిస్టేబుళ్లతో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని మండుటెండను లెక్కచేయకుండా రోడ్డుపై నిలిపిన లారీలను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. సుమారు గంటన్నర పాటు శ్రమించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా లారీలను నిలిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. సకాలంలో స్పందించి ట్రాఫిక్ క్లియర్ చేసిన ఎస్సై నగేష్ కుమార్ మరియు పోలీసు సిబ్బందిని ప్రజలు అభినందించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :