Studio18 News - TELANGANA / MANCHERIAL : తల్లిదండ్రులు – కానిస్టేబుల్ మహిళ పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న ఘటన బెల్లంపల్లి బజార్ ప్రాంతంలోని పరీక్షా కేంద్రం వద్ద చోటుచేసుకుంది. హాల్ టికెట్ నంబర్ల జాబితాను నోటీస్ బోర్డుపై బయట ప్రదర్శించకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ విధుల్లో ఉన్న మహిళ కానిస్టేబుల్తో తల్లిదండ్రుల మధ్య వాగ్వాదం జరిగింది. విషయం తెలిసిన ఎస్ఐ శ్రీనివాసరావు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని శాంతింపజేశారు. అనంతరం పరీక్షా నిర్వాహకులతో మాట్లాడి నోటీస్ బోర్డును బయట ఏర్పాటు చేయించడంతో సమస్య సద్దుమణిగింది.
Admin
Studio18 News