Saturday, 14 March 2026 09:32:14 PM
# పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా # రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు # జిల్లాలో జనాభా గణన–2025 కోసం చర్యలు ప్రారంభం # పీఎం కిసాన్ పథకం నిధుల విడుదల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం # పెద్దమ్మ తల్లి 27వ వార్షికోత్సవంలో ఘనంగా బోనాల ఉత్సవం # రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు, తోఫా పంపిణీ # కౌన్సిలర్ గుర్రం శ్రీనివాస్ అమ్మమ్మ దశదిన కార్యక్రమానికి హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి # సికింద్రాపూర్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు # కేంద్ర నిధులతో అక్కాపూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన # రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి : సీపీఐ జిల్లా కార్యదర్శి భూక్యా రమేష్ # ధర్పల్లి మండలంలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం # రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదు : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి # జిల్లాకు వచ్చిన అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్‌ను కలిసిన కలెక్టర్

చెరువుల్లో గుఱ్ఱపుడెక్క ఆకు తొలగించాలని ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

Date : 13 March 2026 02:37 PM Views : 27

Studio18 News - TELANGANA / RANGAREDDY : ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని మాన్సూరాబాద్ డివిజన్‌లో ఉన్న పెద్ద చెరువు, హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని కుమ్మరికుంట చెరువుల్లో పేరుకుపోయిన గుఱ్ఱపుడెక్క ఆకును పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న వాకర్స్ మాట్లాడుతూ ఇక్కడికి వాకింగ్ రావాలంటే దోమల వల్ల ఎక్కడ విషజ్వరాలు వస్తాయో అనే భయంతో ఉన్నామని తెలిపారు. దోమల ప్రభావం కారణంగా చాలామంది ఉదయం, సాయంత్రం వాకింగ్‌కు రావడానికి జంకుతున్నారని పేర్కొన్నారు. అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత భారస ప్రభుత్వంలో ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో ముందుచూపుతో ఆలోచించి నియోజకవర్గ పరిధిలోని చెరువుల్లో గుఱ్ఱపుడెక్క ఆకు పేరుకుపోకుండా కాలనీ వాసుల సౌకర్యార్థం దోమల నివారణకు డ్రోన్ల సహాయంతో ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహించి సఫలీకృతం చేసినట్టు తెలిపారు. అలాగే చెరువుల్లో దోమల వల్ల ఉత్పత్తి అయ్యే లార్వాను అరికట్టేందుకు వేలాది గంబూజియా జాతికి చెందిన చేప పిల్లలను చెరువుల్లో విడిచిపెట్టడం ద్వారా అవి లార్వాను మింగి దోమల వ్యాప్తిని అరికట్టినట్టు గుర్తు చేశారు. డ్రోన్ పరిజ్ఞానంతో చెరువు మధ్యలోకి వెళ్లలేని ప్రాంతాల్లో కూడా దోమల నివారణ మందులు చల్లడం జరిగినట్లు పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ప్రజా ఆరోగ్యంపై దృష్టి పెట్టకుండా చెరువుల్లో పెరుగుతున్న గుఱ్ఱపుడెక్క ఆకును తొలగించకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రస్తుతం ఉదయం, సాయంత్రం వాకింగ్‌కు వెళ్లాలంటే దోమల దండయాత్ర వల్ల ఎక్కడ మలేరియా, డెంగీ వంటి జ్వరాలు వస్తాయోనని ప్రజలు భయపడుతున్నారని తెలిపారు. కొందరు కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తూ తమ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. ఇట్టి ప్రభుత్వం ఫోర్త్ సిటీ అంటూ గొప్పలు చెప్పుకుంటూ ప్రస్తుతం ఉన్న నగరాన్నే కాపాడుకోలేకపోతుందని, జంట నగరాల అభివృద్ధిని గాలికి వదిలేశారని అన్నారు. సాయంత్రం సమయంలో వాకింగ్‌కు వెళితే పక్కవారితో మాట్లాడే సమయంలో వారి నోట్లోకి కూడా దోమలు దూరుతున్నాయని తెలిపారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజా ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. అలాగే ప్రస్తుతం నియోజకవర్గ పరిధిలోని చెరువుల్లో పేరుకుపోయిన గుఱ్ఱపుడెక్క ఆకును రెండు మూడు రోజుల్లో తొలగించి, అనంతరం చుట్టుపక్కల కాలనీలలో దోమల నివారణ స్ప్రే చేయించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్ రెడ్డి, సామ తిరుమల రెడ్డి, చెన్నగొని శ్రీధర్ గౌడ్, జగదీష్ యాదవ్, టంగుటూరి నాగరాజు, జక్కిడి రఘువీర్ రెడ్డి, భాస్కర్ సాగర్, గోరిగే ప్రదీప్ తదితర నాయకులు, చుట్టుపక్కల కాలనీ వాసులు, పలువురు వాకర్స్ పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :