Friday, 14 February 2025 07:16:06 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

#hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ

#mandakrishna #padmasri

Date : 26 January 2025 12:53 AM Views : 61

Studio18 News - TELANGANA / HYDERABAD : MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు వరించింది. ఏపీ, తెలంగాణలో ఆయన చేసిన సామాజిక సేవలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం లభించింది. గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్రప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ, మందకృష్ణ మాదిగతో పాటు పలువురు తెలుగువాళ్లకు సైతం పద్మ అవార్డులు దక్కాయి. దీంతో మందకృష్ణ మాదిగ అనుచరులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్రానికి ధన్యవాదాలు చెబుతున్నారు. కాగా వరంగల్ జిల్లా శాయంపేటకు చెందిన మందకృష్ణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేశారు. 1994లో ప్రకాశం జిల్లాలోని ఈదుమూడి అనే చిన్నగ్రామం నుంచి 20 మంది యువకులతో 'మాదిగ దండోరా' అంటూ పోరాటం సాగించారు. ఎస్సీ వర్గీకరణ జరగాలని సుదీర్ఘ: కాలం ఉద్యమం చేశారు. ఆయన చేసిన పోరాట ఫలితంగా సుప్రీం కోర్టు వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ జరగాలని అంగీకరించాయి. ఇటీవల ప్రధాని మోడీ కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో ఎస్సీ వర్గీకరణ జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంలోనే మందకృష్ణకు పద్మశ్రీ ప్రకటించడంతో పలువురు ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా స్టూడియో 18 న్యూస్ అధినేత భరత్ కుమార్ శర్మ సైతం మందకృష్ణకు అభినందనలు తెలుపుతూ ఆయన చేసిన సేవలకు నేడు సరైన గౌరవం, సముచిత స్థానం లభించిందని కొనియాడారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :