Saturday, 22 March 2025 09:00:02 AM
# NPCI: ఇనాక్టివ్ ఫోన్ నెంబర్లకు యూపీఐ సేవల నిలిపివేత # Honey Trap: కర్ణాటకలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఆరు నెలల పాటు సస్పెన్షన్ వేటు # Posani Krishna Murali: పోసానికి ఊరట... సీఐడీ కేసులో బెయిల్ మంజూరు # Rajitha Mother : టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటి తల్లి కన్నుమూత.. # తిరుమలలో చంద్రబాబు సంచలన ప్రకటన.. వారికిచ్చిన 35 ఎకరాలు క్యాన్సిల్.. # Tirumala: నారా దేవాన్ష్​లా మీరూ టీటీడీ అన్నప్రసాదం ట్ర‌స్టుకు విరాళం ఇవ్వొచ్చు.. దేనికి ఎంత ఖర్చు అవుతుందంటే? # Chiranjeevi : చిరంజీవి ఫ్యాన్స్ మీటింగ్ పేరుతో డబ్బులు వసూలు.. సోషల్ మీడియాలో హెచ్చరించిన మెగాస్టార్.. # Tech Tips in Telugu : వేసవిలో మీ స్మార్ట్‌ఫోన్ వేడెక్కడానికి అసలు కారణాలివే.. ఈ మిస్టేక్స్ అసలు చేయొద్దు.. బ్యాటరీ సేవింగ్ స్మార్ట్ టిప్స్..! # IPL 2025: కొత్తగా మూడు రూల్స్‌ తీసుకొచ్చిన బీసీసీఐ.. అవేంటంటే? # Telangana : తెలంగాణలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఉగాది నుంచి.. # Chiranjeevi : పీఎం మోదీ ఆ రోజు నాతో ఏం మాట్లాడారంటే.. కన్నీళ్లు వచ్చాయంటూ.. చిరు వ్యాఖ్యలు వైరల్.. # పర్ఫార్మెన్స్, డిజైన్ రెండింటిలోనూ అద్భుతంగా ఉంటుందని స్మార్ట్‌ప్రిక్స్ రిపోర్టు తెలిపింది. ఐక్యూ Z10 సిరీస్‌లో Pro, Z10x వేరియంట్ కూడా ఉంటుందని గతంలో # Telangana Assembly: సై అంటే సై.. అసెంబ్లీలో రగడ.. హరీశ్ రావు వర్సెస్ కోమటిరెడ్డి.. # Gold Price: రాబోయే మూడు నెలల్లో బంగారం ధరలు ఎంతగా పెరుగుతాయో తెలుసా? # MG Comet EV 2025 : కొంటే ఇలాంటి కారు కొనాలి.. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు రేంజే వేరబ్బా.. సింగిల్ ఛార్జ్‌తో 230కి.మీ దూసుకెళ్తుంది..! # Gold: బాబోయ్.. బంగారం రికార్డులే రికార్డులు.. ఆశ్చర్యపరుస్తున్న డబ్ల్యూజీసీ తాజా గణాంకాలు.. 2025 చివరి నాటికి.. # Tata Car Prices : కొత్త కారు కావాలా? ఏప్రిల్‌లో భారీగా పెరగనున్న టాటా PV, EV కార్ల ధరలు.. ఇప్పుడు కొంటేనే బెటర్..! # Mahesh Babu – Sitara : మహేష్ బాబుకే నేర్పిస్తున్న కూతురు సితార.. జెన్ జీ అంటే అట్లుంటది మరి.. వీడియో వైరల్.. # McDonald’s: గుడ్‌న్యూస్‌.. తెలంగాణ నుంచి ఇవి కొనేందుకు మెక్‌డొనాల్డ్స్‌ రెడీ.. ఇక మనవాళ్లకి లాభాలు.. # Affordable SUV Cars : కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. రూ.10లక్షల లోపు SUV కార్లు.. టాప్ 5 మోడల్స్ ఇవే..!

అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులకు పర్మిషన్..! హైదరాబాద్ న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల నజర్..

మద్యం దుకాణాలు, కొనుగోళ్లపై ప్రత్యేక ఆదేశాలు..

Date : 30 December 2024 01:53 AM Views : 105

Studio18 News - TELANGANA / HYDERABAD : న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. డ్రగ్స్ వినియోగించకుండా పలు పబ్ లు, బార్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్ లో పలు బార్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నార్కోటిక్, ఎక్సైజ్, మాదాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో సోదాలు జరిపారు. గంజాయి సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇటు హైదరాబాద్ మూడు కమిషనరేట్ల పరిధిలో ఆంక్షలు విధించారు.

మద్యం దుకాణాలు, కొనుగోళ్లపై ప్రత్యేక ఆదేశాలు.. మరోవైపు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో మద్యం దుకాణాలు, కొనుగోళ్లపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31న మద్యం దుకాణాలను అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచవచ్చని ప్రకటించింది. ఇక బార్లు, రెస్టారెంట్లను అర్థరాత్రి 1 గంట వరకు తెరిచి ఉంచవచ్చని ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో న్యూఇయర్ ను లిక్కర్ పార్టీతో వెల్ కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు మద్యం ప్రియులు.

ఆ పబ్ లకు నో పర్మిషన్.. మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్న న్యూఇయర్ వేడుకలకు సంబంధించి ఇప్పటికే మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేశారు. పబ్ లు, బార్లలో ఈవెంట్లకు సంబంధించి.. అనుమతి ఉన్న వారు మాత్రమే న్యూఇయర్ వేడుకలు నిర్వహించాలన్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 34 పబ్స్ ఉంటే.. అందులో 4 పబ్ లకు సంబంధించి ఈసారి నూతన సంవత్సర వేడుకల నిర్వహణకు అనుమతులు నిరాకరించారు. గత ఏడాదిలో చోటు చేసుకున్న పరిణామాలు, కస్టమర్ల పట్ల వ్యవహరించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి 4 పబ్ లకు అనుమతి నిరాకరించినట్లు చెప్పుకోవచ్చు. ఆ పబ్ లలో గొడవలు జరిగాయి. కస్టమర్లతో వాటి సిబ్బందిలో దురుసుగా ప్రవర్తించారు. గొడవలు జరిగాయి. పార్కింగ్ విషయంలో న్యూసెన్స్ క్రియేట్ చేశాయి. ఈ కారణాలతో ఈసారి న్యూ ఇయర్ వేడుకల నిర్వహణకు ఆ పబ్ లకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రతి ఏడాది నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాత్రి 12 గంటల తర్వాత కూడా బార్ లు నడుపుకునే అవకాశం ఇస్తోంది ప్రభుత్వం. ఒంటి గంటకు క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఈసారి కూడా అదే తరహా అనుమతులు ఇచ్చారు. అయితే, న్యూసెన్స్ లేకుండా, పరిమితికి లోబడి మాత్రమే కస్టమర్లను పిలిపించుకోవాలంది. న్యూసెన్స్ క్రియేట్ చేస్తే మాత్రం నిర్వాహాకులదే బాధ్యత అని పోలీసులు తేల్చి చెప్పారు. హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో (హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ) ఈవెంట్స్ జరగబోతున్నాయి. ప్రధానంగా సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలో పెద్ద సంఖ్యలో పబ్స్ ఉన్నాయి. ఈవెంట్స్ కూడా జరగబోతున్నాయి. మ్యూజికల్ ఈవెంట్లలో పాల్గొనేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు వస్తుంటారు. దాంతో ప్రత్యేక నిఘా ఉండబోతోంది. పోలీసులు విధించిన సమయంలోపే దరఖాస్తులు చేసుకోవాలి. ఆ తర్వాత దరఖాస్తు చేసుకుంటే అనుమతి నిరాకరిస్తారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :