Studio18 News - TELANGANA / SANGAREDDY : సంగారెడ్డి జిల్లా: పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి మరియు భారతినగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కే.సి.ఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. సింధు ఆదర్శ్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లో మాజీ మంత్రి హరీశ్ రావు సూచనల మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టి కృషితో విజయం సాధించినట్లు తెలిపారు. ఈ విజయంపై కే.సి.ఆర్ ఆదర్శ్ రెడ్డిని అభినందించారు. అనంతరం పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితులు, పార్టీ బలోపేతం మరియు భవిష్యత్ కార్యక్రమాలపై ఆయనతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Admin
Studio18 News