Studio18 News - TELANGANA / NIZAMABAD : నిజామాబాద్ జిల్లా: నిజమాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి శనివారం తన స్వగ్రామం రూరల్ మండల పరిధిలోని జలాల్పూర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి స్థానిక గ్రామ సర్పంచ్ చెన్నూరు నవనీత-వెంకట్ రెడ్డి ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన పురోగతిని సమీక్షించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మెచ్చిన పలువురు గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
Admin
Studio18 News