Monday, 23 June 2025 03:08:36 PM
# బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క

కొడంగల్ రైతులు జైల్లో ఉంటే... మంత్రులు లండన్‌లో ఏం చేస్తున్నారో చూడండి: కేటీఆర్

16 మంది రైతులు జైల్లో ఉన్నారన్న కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారని ఆగ్రహం సీఎం మహారాష్ట్ర ఎన్నికల్లో బిజీగా ఉన్నారన్న కేటీఆర్

Date : 13 November 2024 04:40 PM Views : 166

Studio18 News - TELANGANA / : కొడంగల్ రైతులు జైల్లో ఉన్న ఈ సమయంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లండన్‌లో ఏం చేస్తున్నారో చూడండంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఫార్మా సిటీ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యపు భూసేకరణను నిరసిస్తూ 16 మంది రైతులు జైల్లో ఉన్నారని, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్న పని చూడండంటూ ఎక్స్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓ బస్సులో పౌరాణిక పాత్రలను ఇమిటేట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు లండన్‌లో ఉన్నారని, కానీ రైతులు మాత్రం జైల్లో ఉన్నారని ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలలుగా పోరాటం ఫార్మా విలేజ్‌ను నిరసిస్తూ ఆరు నెలలుగా కొడంగల్ నియోజకవర్గంలో రైతులు ఉద్యమిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ప్రజల తిరుగుబాటులో ఎవరి కుట్రా లేదన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ముచ్చ‌ర్ల‌లో ఫార్మా సిటీ రద్దు అని సీఎం చెప్పగానే భూములు ఇచ్చిన రైతులు సంతోషపడ్డారన్నారు. తమ భూములు తమకు ఇస్తారని రైతులు సంతోషపడ్డారన్నారు. కానీ నెల రోజుల్లోనే ఫార్మా సిటీ రద్దు అటుంచి... ఫార్మా విలేజ్ పెడతామని చెప్పడంతో వారు ఆందోళలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ఆనవాళ్లు ఉండకూడదన్న ఉద్దేశంతో ఫార్మా సిటీ పేరును ఫార్మా విలేజ్‌గా మార్చారని ఆరోపించారు. ఫార్మా రంగాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ ఫార్మా యూనివర్సిటీ తేవాలని తాము 14 వేల ఎకరాలు సేకరించామని తెలిపారు. ఏమీ తెలియకుండానే తాము ఇదంతా చేయలేదన్నారు. తెలంగాణను ఫార్మా రంగంలో లీడర్ చేయాలని భావించామని... ఫార్మా సిటీని అత్యున్నతంగా తీర్చిదిద్దేందుకు అధికారులు విదేశాల్లో కూడా పర్యటించినట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫార్మా సిటీ పూర్తి చేద్దామని తాము భావించామని, అలాగే భూములిచ్చిన రైతులకు ఫ్లాట్లు కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేశామన్నారు. అలాంటి ఫార్మా సిటీని వదిలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తుగ్లక్, మూర్ఖ నిర్ణయాలతో అందరినీ ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. అందుకే ప్రజలు తిరగబడుతున్నారని తెలిపారు.

Also Read : ప్రధాని మోదీ పాదాలను తాకేందుకు ప్రయత్నించిన నితీశ్ కుమార్

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :