Saturday, 14 December 2024 07:07:39 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Minister Tummala: రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు..

Date : 19 October 2024 01:57 PM Views : 44

Studio18 News - తెలంగాణ / : Minister Tummala Nageswara Rao : ఖరీఫ్ రైతులకు రైతు భరోసాపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వలేమని చెప్పారు. పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వలేమని పేర్కొన్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక తరువాత రైతు భరోసా ఇస్తామని తుమ్మల చెప్పారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై తుమ్మల విమర్శలు చేశారు. గత ప్రభుత్వం పంట వేయని భూములకు రూ. 25వేల కోట్లు ఇచ్చిందని అన్నారు. సన్నధాన్యం పండించిన ప్రతీ రైతుకు రూ. 500 బోనస్ ఇస్తామని తుమ్మల చెప్పారు. ఆర్థిక వెసులుబాటు లేకపోయినా ముఖ్యమంత్రి రుణమాఫీ అంశాన్ని తన భుజాన వేసుకున్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం. 42 బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకొని రుణమాఫీ చేశామని తుమ్మల చెప్పారు. 20లక్షల మందికి ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉంది.. రెండు లక్షలపైన ఉన్న డబ్బులు కడితే రుణమాఫీ అవుతుందని తెలిపారు. తెల్ల రేషన్ కార్డు లేని మూడు లక్షల మందికి డిసెంబర్ లో కుటుంబ నిర్ధారణ చేసి వారికి కూడా రుణమాపీ చేస్తామని తుమ్మల చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :