Sunday, 08 March 2026 04:20:54 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్

మా బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించినా.. మా వాళ్లను ఇబ్బంది పెట్టినా.. తస్మాత్ జాగ్రత్త..

Date : 10 November 2024 05:53 PM Views : 752

Studio18 News - TELANGANA / : పోలీసు అధికారులను మాజీమంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడితే జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఏపీలో ఏం జరుగుతుందో చూస్తున్నారని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. అన్యాయం చేసే వారిని విడిచి పెట్టేది లేదన్నారు. కార్యకర్తలను ఇబ్బంది పెడితే వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు హరీశ్ రావు. ”పిటిషన్లు ఇస్తే మా సోదరి సునీతమ్మ ఇంటిపై దాడి జరిగింది. మేము అందరం అక్కడికి వెళ్లాం. దరఖాస్తు ఇస్తే తిరిగి మన మీదే కేసు పెడుతున్నారు. ఈ సందర్భంగా చెబుతున్నా.. డీఎస్పీలు, ఎస్పీలు, సీనియర్ అధికారులు.. ఆంధ్రప్రదేశ్ లో ఏమైందో చూస్తున్నారు.. మీరు అన్యాయంగా కేసులు పెట్టినా, అక్రమంగా మా బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించినా.. మా వాళ్లను ఇబ్బంది పెడితే తస్మాత్ జాగ్రత్త.. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం. గ్యారెంటీగా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. మీ సంగతి చెబుతాం. ఎవరు అన్యాయం చేసినా విడిచిపెట్టం. రాసి పెట్టుకుంటున్నాం. తప్పకుండా ఏ అధికారి అయినా అమర్యాదగా ప్రవర్తించినా, అన్యాయంగా వ్యవహరించినా.. మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే.. వడ్డీతో సహా చెల్లిస్తాం. జాగ్రత్త” అని హెచ్చరించారు హరీశ్ రావు. ”సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నా. మూసీ సమస్యలపై పాదయాత్రకు నేను సిద్ధమే. హైదరాబాద్, నల్గొండలో ఎక్కడైనా పాదయాత్రకు నేను రెడీ. కేసీఆర్ రైతులు సీఎం అయితే, రేవంత్ రెడ్డి బూతుల సీఎం. పాలనను గాలికొదిలి సీఎం, మంత్రులు హెలికాప్టర్లలో తిరుగుతున్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారు. కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు కుట్ర చేస్తోంది. మూసీ ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్, టీడీపీ పాలనే కారణం” అని హరీశ్ రావు మండిపడ్డారు.

Also Read : విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :