Wednesday, 25 June 2025 08:04:33 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

బల్కంపేట ఎల్లమ్మకు యాపిల్స్‌తో ప్రత్యేక అలంకరణ, భక్తుల కోలాహలం

Date : 10 June 2025 07:01 PM Views : 97

Studio18 News - TELANGANA / HYDERABAD : హైదరాబాద్‌లోని సుప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ చేసి, ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయ పండితులు వేదమంత్రోచ్ఛారణల నడుమ ఎల్లమ్మ తల్లికి కుంకుమార్చన చేశారు. అమ్మవారి మూలవిరాట్టును యాపిల్స్, వివిధ రకాల సువాసనభరితమైన పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఈ ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు కనువిందు చేశారు. ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొనేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పర్యవేక్షించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :