Thursday, 15 May 2025 02:54:42 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

డెడికేటెడ్ కమిషన్ చైర్మన్‌కు నివేదిక అందించిన కవిత

బీసీ కులగణన గురించి 35 పేజీల వినతిపత్రం ఇచ్చిన కవిత కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలని కవిత డిమాండ్ డెడికేటెడ్ కమిషన్ స్వతంత్రంగా పని చేయాలన్న కవిత

Date : 25 November 2024 03:37 PM Views : 151

Studio18 News - TELANGANA / : బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సిద్ధం చేసిన 35 పేజీల నివేదికను కమిషన్ చైర్మన్‌కు ఆమె అందించారు. బీసీ సంఘాలు, యునైటెడ్ పూలే ప్రంట్, తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి ఈ నివేదికను సమర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్‌ను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘాలు, మేధావులు ఇచ్చిన సూచనలను అమలు చేయలేదని విమర్శించారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం 11 నెలలు తాత్సారం చేసిందని ఆరోపించారు. డెడికేటెడ్ కమిషన్ స్వతంత్రంగా పని చేయాలని ఆకాంక్షించారు. అయినా ప్రత్యేక కార్యాలయం, మానవ వనరులు, సామాగ్రి ఇవ్వకుంటే ఆ కమిటీ ఎలా పని చేస్తుందని ప్రశ్నించారు. కుల గణనపై నెల రోజుల్లోనే నివేదిక అంటే ఎన్నో అనుమానాలు వస్తున్నాయన్నారు. డెడికేటెడ్ కమిటీకి చట్టబద్ధత కల్పించాలన్నారు. రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికీ స్టిక్కర్ వేయని ఇళ్లు దాదాపు 70 శాతం ఉన్నాయని, కానీ సర్వే మాత్రం 90 శాతం పూర్తయిందని చెప్పడం ఏమిటన్నారు. కులగణకు బీజేపీ వ్యతిరేకమి విమర్శించారు. కులగణన చేపట్టబోమని బీజేపీ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది వెల్లడించారు. ఆ పార్టీ తీరును బీసీలు ఖండించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్‌లో ఎన్నో హామీలు ఇచ్చిందని, ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Also Read : మహారాష్ట్ర సీఎం పదవిపై ఉత్కంఠ... స్పందించిన అజిత్ పవార్

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :