Sunday, 29 March 2026 05:17:25 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Telangana State Election Commission: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఇదే.. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్

Date : 27 January 2026 06:35 PM Views : 79

Studio18 News - TELANGANA / HYDERABAD : 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల తక్షణమే రాష్ట్రంలో అమల్లోకి ఎన్నికల కోడ్ రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ఫిబ్రవరి 16న మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కోసం రేపటి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు తెలిపారు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని తెలిపారు. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు ఉంటుందని వెల్లడించారు. వచ్చే నెల 16వ తేదీన కార్పొరేషన్‌లలో మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరుగుతాయని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో 52 లక్షల 43 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 130 మున్సిపాలిటీలు ఉంటే వివిధ కారణాలతో 116 మున్సిపాలిటీలలో మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. కంట్రోల్ రూం నుంచి ఓటింగ్ ప్రక్రియను మానిటరింగ్ చేయనున్నట్లు తెలిపారు. రూ.50 వేలకు మించి నగదుకు లెక్క చూపవలసి ఉంటుందని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతాయని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :