Studio18 News - TELANGANA / HYDERABAD : ధర్పల్లి మండలం హొన్నజీపేట్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 200 ట్రాక్టర్ల ఇసుకను తహసీల్దార్ శాంత సీజ్ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం తహసీల్దార్ కార్యాలయంలో ఇసుక వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో హొన్నజీపేట్, కొట్టాలపల్లి, ధర్పల్లి ప్రాంతాలకు చెందిన కొనుగోలు దారులు పదివేల రూపాయల డిపాజిట్ చెల్లించి పాల్గొన్నారు. వేలంపాటలో ఎవరు అత్యధిక ధరకు పాడితే వారికి ఇసుక కేటాయించబడుతుందని తహసీల్దార్ తెలిపారు.
Admin
Studio18 News