Studio18 News - TELANGANA / : మంత్రి కొండా సురేఖపై తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై దుబ్బాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు వెల్లడించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో మహిళలపై వస్తున్న ట్రోలింగ్ను తిప్పికొడతామన్నారు. తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలను అవమానించడం సరైన పద్ధతి కాదన్నారు. మంత్రిపై తప్పుడు పోస్టులు పెట్టిన వారు ఎంత పెద్దవారైనా శిక్షపడేలా చేస్తామన్నారు. హైడ్రా నిబంధనలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. అఖిలపక్ష భేటీకి అన్ని పార్టీలను ఆహ్వానించాలన్నారు. హైడ్రాపై కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కూడా బుల్డోజర్లతో కూల్చిన విషయాన్ని మరిచినట్లున్నారని చురక అంటించారు.
Admin
Studio18 News