Studio18 News - TELANGANA / HYDERABAD : ఏ.ఎస్.రావు నగర్ లోని జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ జోయాలుక్కాస్ బ్రిల్లియన్స్ డైమండ్ జ్యువెలరీ షోను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఈ వజ్రాభరణాల షో డిసెంబర్ 5 నుండి 21 వరకు ఉంటుందని తెలిపారు. ఈ ప్రదర్శన వజ్రాల ఆభరణాలలో హస్తకళ, చిక్కదనం, ఆవిష్కరణల మరపురాని వేడుకకు హామీ ఇస్తుందన్నారు. జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జోయాలుక్కాస్ మాట్లాడుతూ బ్రిల్లియన్స్ డైమండ్ జ్యువెలరీ షో అనేది వజ్రాల ఆభరణాల శాశ్వత ఆకర్షణకు డిజైన్లలో పరిపూర్ణత పట్ల మనకున్న మక్కువకు చిహ్నమని, మా ప్రయాణంలో ఎ.ఎస్. రావు నగర్ కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. పండుగ సీజన్లో నిర్వహించే ఈ ప్రదర్శన, అందం, వ్యక్తిత్వం మరియు నైపుణ్యాన్ని ఉత్తమంగా ప్రతిబింబించే డిజైన్లను కనుగొనడానికి వినియోగదారులకు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రదర్శన కాలంలో లక్ష అంతకంటే ఎక్కువ విలువైన వజ్రాభరణాలను కొనుగోలు చేసే వినియోగదారులు ప్రతి కొనుగోలుతో ఉచిత బంగారు నాణెం అందుకుంటారన్నారు. ఇది షాపింగ్ అనుభవాన్ని మరింత ఉత్తేజపరుస్తుందని తెలిపారు. బ్రిల్లియన్స్ డైమండ్ జ్యువెలరీ షో డిసెంబర్ 21, 2025 వరకు ఎ.ఎస్. రావు నగర్ లోని జోయాలుక్కాస్ షోరూమ్ ప్రత్యేకంగా జరుగుతుందని, సందర్శకులు ఇక్కడ అందమైన వజ్రాల ప్రపంచాన్ని అనుభవించవచ్చని, ప్రతి ఆభరణం లగ్జరీ, కలకాలం నిలిచిపోయే అందం యొక్క కథను చెబుతుందని అన్నారు.
Admin
Studio18 News