Sunday, 29 March 2026 05:22:29 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Komatireddy Venkat Reddy: తెలంగాణ వచ్చిన తొలి పదేళ్లలో ప్రజల సమస్యలు తీరలేదు: కోమటిరెడ్డి

Date : 27 January 2026 07:15 PM Views : 120

Studio18 News - TELANGANA / HYDERABAD : తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన పాఠశాలను ప్రారంభించిన కోమటిరెడ్డి సరైన విద్య అందితేనే పేదల సమస్యలు తీరుతాయన్న మంత్రి విద్యార్థులకు స్కిల్స్ లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్య తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తొలి 10 ఏళ్లలో ప్రజల సమస్యలు తీరలేదని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్లొండలోని బొట్టుగూడలో ‘కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్’ ఆధ్వర్యంలో రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించిన పాఠశాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పాఠశాల ప్రారంభోత్సవ వేదికపై కోమటిరెడ్డి మాట్లాడుతూ... "సరైన విద్య అందితేనే పేదల సమస్యలు తొలగుతాయి. ప్రభుత్వం ఏటా వేల కోట్లు విద్యపై ఖర్చు చేస్తోంది. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తొలి పదేళ్లలో మన సమస్యలు తీరలేదు" అని అన్నారు. బొట్టుగూడ స్కూల్‌ను ఒక మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దుతామని, దేశంలో ఎక్కడా ఇలాంటి ప్రభుత్వ పాఠశాల లేదని, మరెక్కడా కనిపించదని ఆయన గర్వంగా చెప్పారు. స్కూల్‌లో కంప్యూటర్లు, డిజిటల్ బోర్డులు, క్రీడా సదుపాయాలు కల్పించామని వివరించారు. అయితే, విద్యార్థులకు మార్కులు బాగా వస్తున్నా... ఉద్యోగాల సమయంలో అవసరమైన నైపుణ్యాలు (స్కిల్స్) లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. "మన విద్యార్థులు మార్కుల్లో ముందుంటారు. కానీ స్కిల్స్ లేకపోతే ఉద్యోగాలు రావు. ఈ విషయంపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలి" అని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో సంభాషించారు, టీచర్లతో చర్చించారు. బొట్టుగూడ స్కూల్‌ను రాష్ట్రంలోనే అత్యుత్తమ మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దాలని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :