Studio18 News - TELANGANA / HYDERABAD : ECIL పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీలో ఏర్పాటు చేసిన రాధా స్టడీ హాల్స్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్మిక శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ గారితో కలిసి ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇలాంటి స్టడీ హాల్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రశాంత వాతావరణం, అవసరమైన సౌకర్యాలు అందించడం ద్వారా వారి విజయానికి ఇది దోహదపడుతుందని చెప్పారు. మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామి గారు, యువతకు విద్యా వనరులు అందుబాటులో ఉండడం అత్యంత అవసరమని, ఇలాంటి కార్యక్రమాలు సమాజ అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు, విద్యార్థులు మరియు ప్రాంతీయ ప్రజలు పాల్గొన్నారు.
Admin
Studio18 News