Thursday, 27 March 2025 01:47:37 PM
# ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు # Sanjeev Goenka: గోయెంకా... పంత్ ను కూడా ఏకిపడేశాడా? # Nirmala Sitharaman: ప్రసాదంపై జీఎస్టీ మినహాయింపు: ప్రకటించిన నిర్మలా సీతారామన్ # Suman: చంద్రబాబు, పవన్ క‌ల్యాణ్‌ కాంబినేషన్ బాగుంది: నటుడు సుమన్

అల్లు అర్జున్ అత్యవసర పిటిషన్... ఉదయం మెన్షన్ చేయాలి కదా అన్న హైకోర్టు

ఇప్పటికే క్వాష్ పిటిషన్ దాఖలు చేశాం.. అత్యవసరంగా విచారించాలన్న న్యాయవాది ఉదయం గం.10.30కే మెన్షన్ చేయాలి కదా అన్న హైకోర్టు సోమవారం వరకు చర్యలు తీసుకోకు

Date : 13 December 2024 03:09 PM Views : 75

Studio18 News - TELANGANA / : అరెస్ట్ నేపథ్యంలో సినీ నటుడు అల్లు అర్జున్ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే క్వాష్ పిటిషన్ దాఖలు చేశామని, దీనిని అత్యవసరంగా విచారించాలని కోరారు. అయితే మధ్యాహ్నం చెబితే ఎలా అంటూ హైకోర్టు పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించింది. అయితే తదుపరి విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది. ఉదయమే మెన్షన్ చేయాలి కదా అన్న హైకోర్టు సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ కోసం ఆయన న్యాయవాది ప్రయత్నాలు చేశారు. అత్యవసరంగా పిటిషన్‌ను విచారించాలని హైకోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను బుధవారం వేశామని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. అయితే అత్యవసర పిటిషన్ అయితే ఉదయం గం.10.30కే మెన్షన్ చేయాలి కదా అని కోర్టు... అల్లు అర్జున్ న్యాయవాదిని ప్రశ్నించింది. క్వాష్ పిటిషన్ అంశాన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. పరిస్థితుల దృష్ట్యా లంచ్ మోషన్ పిటిషన్‌గా స్వీకరించాలని పిటిషనర్ కోరారు. మధ్యాహ్నం గం.1.30 సమయానికి లంచ్ మోషన్ పిటిషన్ విచారణ కోరడం సరికాదని పీపీ తెలిపారు. సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని విజ్ఞప్తి సోమవారం వరకు ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని అల్లు అర్జున్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టును కోరారు. అయితే పోలీసుల నుంచి వివరాలు సేకరించిన తర్వాత కోర్టుకు సమాచారం ఇస్తానని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు వివరాలు సమర్పిస్తామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో తదుపరి విచారణను సాయంత్రం 4 గంటలక వాయిదా వేశారు. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశాం: సీపీ సీవీ ఆనంద్ కాగా, అల్లు అర్జున్ అరెస్ట్ ను పోలీసులు నిర్దారించారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిన్నట్టు లా అండ్ ఆర్డర్ సీపీ విక్రమ్ సింగ్ మాన్ వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం అతనిని కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు.

Also Read : ఒక యోగిలా ఉన్నారు... ఆయనను చూస్తుంటే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తోంది: మంత్రి పయ్యావుల

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :