Sunday, 15 March 2026 10:02:52 AM
# షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్ # హోన్నజీపేటలో ఎస్సీ/ఎస్టీ కేసు విచారణ… గ్రామాన్ని సందర్శించిన ఏసీపీ బి. ప్రకాష్ # వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్, నర్సరీ మొక్కల పరిశీలన # ఈ రోజు బిపూర్ణోదయ స్కూల్ వార్షికోత్సవంలో మొద్దు లచ్చి రెడ్డి పాల్గొన్నారు # పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా

#Rajannasircilla : ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన ఏడుగురు క్షేమం

Date : 29 August 2025 10:50 PM Views : 324

Studio18 News - TELANGANA / RAJANNA SIRCILLA : భారీ వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఎగువ మానేరు అవతలి వైపు చిక్కుకున్న ఐదుగురు వ్యక్తులు 30 గంటలుగా నరకయాతన అనుభవించారు. బుధవారం నుండి భారీ వర్షాలకు ఎగువ మానేరు ఉగ్రరూపం దాల్చడంతో మానేరు ఉప్పొంగి ప్రవహిస్తోంది.. గేదెలను మేపడానికి అవతలి వైపు వెళ్లిన కాపరులతోపాటు రైతులు మొత్తం ఆరుగురు ప్రమాదంలో చిక్కుకున్నారు. ఇందులో ఎగువ మానేరు ప్రాజెక్టు దగ్గర నర్మాల గ్రామానికి చెందిన కాడి నాగం గల్లంతు కాగా ... ఐదుగురు వాగు అవుతలి గడ్డకు చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సంఘటన సంవత్సరం అందుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్, ఎస్పీ మహేష్ కుమారులు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని పిలిపించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా బుధవారం రాత్రికి కూడా బాధితులను తీసుకురాలేకపోయారు. బాధితులను కాపాడేందుకు 30 గంటలుగా వారు శ్రమించారు. సమాచారం అందుకున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో మాట్లాడి రెండు ఆర్మీ హెలికాప్టర్లను పంపాలని విన్నవించారు. కాగా.. గురువారం భారీ వర్షాల నేపథ్యంలో హెలికాప్టర్ల రాక ఆలస్యమైంది. మధ్యాహ్నం వర్షం తగ్గడంతో మరోసారి ఆర్మీ అధికారులతో బండి సంజయ్ మాట్లాడి రెండు హెలికాప్టర్లను నర్మాలకు తెప్పించారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది ఐదుగురు బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రెస్క్యూ ఆపరేషన్ ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పర్యవేక్షించారు. ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా.. ప్రాజెక్ట్ వద్ద చిక్కుకుపోయిన వారిని క్షేమంగా గమ్యం చేర్చారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :