Studio18 News - TELANGANA / NIZAMABAD : ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఉన్నత పాఠశాలలో మంగళవారం పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు (ఫేర్వెల్) పార్టీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తొమ్మిదో తరగతి విద్యార్థులు పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధానోపాధ్యాయులు మురళీధర్, విద్యార్థులు చదువుతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరకంగా, మానసికంగా ఉల్లాసం పొందుతారని తెలిపారు. పాఠశాల జీవితం రాబోయే భవిష్యత్తుకు పునాది లాంటిదని, విద్యార్థులు చదువుతోపాటు సంస్కారాన్ని కూడా అలవాటు చేసుకుని తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సామ శ్రీనివాస్, సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ఉప సర్పంచ్ శ్రీకాంత్, మహిపాల్ యాదవ్, ఉపాధ్యాయులు దేవీదాస్, సత్యవాణి, జైనాబ్, అలాగే 9వ మరియు 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Studio18 News