Saturday, 26 April 2025 07:39:36 AM
# హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఇచ్చిపడేస్తారా? తెలంగాణ కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ వర్కౌట్‌ అవుతుందా.?

Date : 03 October 2024 10:12 AM Views : 94

Studio18 News - TELANGANA / : Gossip Garage : అవును మనం వెనకబడిపోయాం. కారు దూసుకెళ్తుంది. కమలం కూడా తగ్గడం లేదు. అనుకున్నంత స్థాయిలో మన రియాక్షన్‌ ఉండటం లేదు. ఇక నుంచి ఇచ్చిపడేద్దాం. ఒకటి అంటే నాలుగు అనేద్దామని ఫిక్స్ అయిపోయిందట కాంగ్రెస్. ప్రతిపక్షాల విమర్శలకు స్ట్రాంగ్‌ కౌంటర్లు ఇవ్వాలని నేతలకు ధైర్యం నూరిపోశారట ముఖ్యనేతలు. డ్యామేజ్‌ కంట్రోల్ చేసుకోవాలంటే..ఇప్పటి లెక్క ఉంటే అయితే కుదరదని డిసైడ్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ హస్తం యాక్షన్ ప్లానేంటి.? ఇప్పుడున్న పరిస్థితుల్లో అపోజిషన్‌కు ఇచ్చిపడేయడం అంత ఈజీనా.? విప‌క్షాల వ్యూహాల‌ను చిత్తు చేసేందుకు సరికొత్త అస్త్రం.. ఇప్పటి దాకా ఓ లెక్క. ఇప్పటి నుంచి మరో లెక్క అంటోంది తెలంగాణ కాంగ్రెస్. అంటే పడ్డాం.. అపోజిషన్‌ కదా అని వదిలేశాం..ఇక కథ వేరే ఉంటదని చెప్తోంది. ప్రతిపక్షాల మాటకు ధీటుగా జవాబు ఇస్తామంటోంది. విప‌క్షాల విమర్శలను ఎలా తిప్పికొట్టాల‌నే దానిపై మేధోమ‌ధ‌నం చేస్తోంది. అందుకోసం స‌రికొత్త వ్యూహంతో ముందుకెళ్లాలని చూస్తోంది కాంగ్రెస్. విప‌క్షాల వ్యూహాల‌ను చిత్తు చేసేందుకు సరికొత్త అస్త్రాన్ని సిద్దం చేసుకుంటోంది. తిప్పకొట్టకపోతే జ‌నం నుంచి మరింత వ్యతిరేకత వ్యక్తమవుతుందనే ఆందోళన.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి దాదాపు ప‌ది నెల‌లు కావొస్తుంది. రైతు రుణమాఫీ నుంచి మూసీ సుంద‌రీక‌ర‌ణ‌ వరకు ప్రతీ అంశంపై అపోజిషన్‌ నుంచి ప్రెజర్‌ ఎదుర్కోటోంది అధికార పార్టీ. ఈ అంశాల‌పై జ‌నంలో కూడా తీవ్ర చ‌ర్చనీయాంశం అవుతుండంటంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. విప‌క్షాల విమర్శలను తిప్పికొట్టక‌పోతే జ‌నం నుంచి మరింత వ్యతిరేకత వ్యక్తం అవుతుందని.. దీన్ని సాధ్యమైనంత త్వర‌గా యాక్షన్‌కు రియాక్షన్‌ ఉండాలని భావిస్తోంది. అందుకోసమే ఈ మ‌ధ్య కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్షం స‌మావేశం ఏర్పాటు చేసింది. కొత్త పీసీసీ చీఫ్‌కు స‌న్మానం పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రస్తుత రాజకీయ ప‌రిస్థితుల‌పైనే చ‌ర్చించారు. ప్రభుత్వంలో భాగ‌స్వామ్యమైన కార్పొరేష‌న్ ఛైర్మన్లతో పీసీసీ చీఫ్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నం.. కార్పొరేష‌న్ ఛైర్మన్ల స‌మావేశంలో సీఎం రేవంత్‌, పీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్‌ గౌడ్ ప్రధానంగా ఒక అంశాన్ని బ‌లంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప‌దేళ్ల త‌ర్వాత కార్యక‌ర్తలు బ‌లంగా పోరాడి సాధించిన అధికారాన్ని క‌లిసి క‌ట్టుగా నిల‌బెట్టుకోవాల్సిన అవ‌సరం ఉంద‌ని సెంటిమెంట్‌ను ర‌గిలించార‌ట‌. ప్రభుత్వం అనేక మంచి ప‌నులు చేస్తున్నా..వాటిని జ‌నంలోకి స‌మ‌ర్థవంతంగా తీసుకెళ్లడంలో విఫ‌ల‌మ‌వుతున్నామ‌నే అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. పెద్ద మొత్తంలో రుణ‌మాఫీ చేసినా అనుకున్నంత పాజిటివ్ రాక‌పోగా..జ‌నంలో నెగిటివ్ అవుతున్నామని ప్రస్తావించారు. రుణ‌మాఫీ కాని రైతుల‌కు కూడా త్వర‌లో రుణమాఫీ చేస్తామ‌నే భ‌రోసా క్యాడ‌ర్‌కు క‌ల్పించాల‌ని నేతలకు దిశానిర్దేశం చేశారట. ఇక హైడ్రా విష‌యంలో విప‌క్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫ‌ల‌మ‌వుతున్న విష‌యాన్ని కూడా చ‌ర్చించారు. చెరువులు, పార్కుల ప‌రిర‌క్షణ కోసం ఏర్పాటు చేసిన వ్యవ‌స్థ విష‌యంలో ప్రజ‌ల్లో పాజిటివ్ చ‌ర్చ జరిగేలా ప్రయత్నించాలని సీఎం, పీసీసీ చీఫ్‌ నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు. ప‌రిస్థితి చేయిదాటి.. అంద‌రూ మునిగే ప్రమాదం..! ఇక మూసీ సుంద‌రీక‌ర‌ణ విష‌యంలో పార్టీ గొంతు ఏమాత్రం జ‌నంలోకి పోవ‌డం లేద‌ని అటు సీఎం, ఇటు పీసీసీ చీఫ్ ఇద్దరూ ఆవేద‌న వ్యక్తం చేశారు. మూసీ విష‌యంలో గ‌తంలో బీఆర్‌ఎస్‌, బీజేపీలు చెప్పిన హామీల‌ను జ‌నంలోకి తీసుకెళ్లాల‌ని సూచించారు. పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్రజ‌లకు కాంగ్రెస్ అండ‌గా ఉంటుంద‌నే భ‌రోసా క‌ల్పించ‌డంలో వెన‌క‌బ‌డిపోయామ‌న్నారు. ఈ విష‌యంలో ప్రజాప్రతినిధుల‌తో పాటు పార్టీ కూడా స‌మిష్టిగా ప‌నిచేయాల‌ని సూచించారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాల‌ను జ‌నంలోకి స‌మ‌ర్థవంతంగా తీసుకెళ్లడంలో పార్టీ ముందుండాల‌ని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నేత‌లు స‌మిష్టిగా ప‌నిచేస్తేనే త్వర‌లో వ‌చ్చే స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో మంచి రిజ‌ల్ట్ వ‌స్తుంద‌ని లేక‌పోతే ప‌రిస్థితి చేయిదాటి..అంద‌రూ మునిగే ప్రమాదం ఉంద‌ని హెచ్చరించారు. దీంతో అపోజిషన్‌ను ఎదుర్కునేందుకు కాంగ్రెస్ వేస్తున్న యాక్షన్‌ ఎంత వరకు వర్కౌట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :