Studio18 News - TELANGANA / JOGULAMBA GADWAL : జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ పోరు భగ్గుమనింది. గద్వాల జిల్లా కేంద్రంలో అమృత్ 2.0 పథకం ప్రారంభం కార్యక్రమనికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పట్టణానికి చేరుకున్నారు. మార్గమధ్యంలోనే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి శాలువా కప్పి పూలదండతో సత్కరించారు.అనంతరం అక్కడి నుంచి సభాస్థలికి వెళ్లగా సభకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు స్టేజిపై నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవిని, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కూడా ఆహ్వానితులు ఆహ్వానించారు. అలా ఒక్కో ప్రజాప్రతినిధిని అధికారి పిలిచి చివరకు అక్కడే ఉన్న మాజీ జడ్పీ చైర్ పర్సన్ అయిన సరితను పిలువకపోవడంతో ఒక్కసారిగా సరిత వర్గం ఆగ్రహం వెలుబుచ్చారు. దాంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనతో సరిత వర్గీయులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా .. మనస్థాపానికి గురైన మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరిత తన అనుచరులతో కలిసి కార్యక్రమాన్ని బహిష్కరించి కారులో వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో మంత్రి పర్యటన సందర్భంగా గద్వాలలో ఎలాంటి గొడవలు జరగకుండగా పోలీసులు ముందుజాగ్రత్తగా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. గత కొంత కాలంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ వర్గానికి మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరిత వర్గానికి మధ్య జరుగుతున్న పోరు మంత్రి పర్యటన సందర్భంగా మరోసారి బయటపడటంతో జిల్లా కాంగ్రెస్ శ్రేణులు తలలు పట్టుకున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైన కాంగ్రెస్ అధిష్టానం వీరిద్దరి మధ్య సయోద్యను కుదురుస్తారో లేదో అని స్థానికులు బహిరంగంగానే మాట్లాడటం ఇప్పుడు గద్వాలలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read : రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్..
Admin
Studio18 News