Studio18 News - TELANGANA / RAJANNA SIRCILLA : వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ఘటనలో దాదాపు 60 నుంచి 70 క్వింటాళ్ల వరకు ఇంట్లో నిల్వ ఉంచిన పత్తి పూర్తిగా కాలి బూడిదైంది. యాదవ సంఘం సమీపంలో నివాసముంటున్న పెరుగు జలంధర్ ఇంటిలో షార్ట్సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.ఇంట్లో నిల్వ చేసిన భారీ మొత్తంలో పత్తి ఉండడంతో అగ్ని వేగంగా వ్యాపించి క్షణాల్లో పూర్తిగా దగ్దమైంది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుని, సుమారు గంటపాటు శ్రమించి మంటలను పూర్తిగా నియంత్రించారు. షార్ట్సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాలిపోయిన పత్తి విలువ సుమారుగా 60 నుండి 70 క్వింటాళ్లు ఉంటుందని అంచనా వేశారు.దీంతో రైతు జలంధర్ కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. దీనిపై అధికారులు వెంటనే స్పందించి, తక్షణమే ఆదుకోవాలని భాదితులు కోరుతున్నారు.
Admin
Studio18 News