Studio18 News - TELANGANA / HYDERABAD : శ్రీ రామనవమి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ముషీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో అట్టహాసంగా జరిగాయి. ఈ పవిత్ర కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నగేష్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీ రాముడి ఆచారాలు, ధర్మం, న్యాయం ప్రతి ఒక్కరూ ఆచరించాల్సినవని, సమాజంలో సత్సంస్కారాలు పెంపొందించేందుకు ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భిక్షపతి, రమేష్, కన్నా, శేఖర్, నాగ సాయి తదితరులు పాల్గొని భక్తులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ఈ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా కొనసాగి భక్తి భావాన్ని మరింత పెంపొందించాయి.
Admin
Studio18 News