Sunday, 29 March 2026 05:20:29 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్

Date : 06 December 2025 07:08 PM Views : 295

Studio18 News - TELANGANA / KHAMMAM : ఇటీవల కాలంలో సత్తుపల్లి అటవీశాఖ రేంజ్ పరిధిలో నాటు తుపాకులతో 5 జింకలను వేటాడి చంపిన ఘటన తెలిసిందే.. అయితే ఘటనలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్ద్ విక్రమ్ సింగ్ మీడియా సమావేశంలో తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి అటవీశాఖ రేంజ్ పరిధిలో గత నెల 24 న అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సోదరుడి కుమారుడు మెచ్చా రఘు, అతని స్నేహితులు కొందరు అదే ప్రాంతంలో అటవీశాఖలో ఔట్ సోర్స్ ఉద్యోగిగా పనిచేస్తున్న గోపికృష్ణ అనే వ్యక్తి మద్దతు తీసుకొని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. గత నెల 24 సాయంత్రం 6 గంటల తరువాత అటవీప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను మార్చి, ఏమార్చి గోపికృష్ణ అనే ఔట్ సోర్స్ ఉద్యోగి సహాయంతో నాటు తుపాకులతో ఓ వాహనంలో నలుగురు వ్యక్తులు వెళ్లి 5 జింకలను వేటాడి చంపినట్లు గుర్తించామని అన్నారు. ఘటన అనంతరం నిధితులు వివిధ ప్రాంతాలకు పారిపోయి తలదాచుకున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పోలీసుల సహకారంతో నిన్న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేసి, వేటకు ఉపయోగించిన నాటు తుపాకులను, ఒక 4 వీల్ వాహనంను సీజ్ చేసి నిందితులను జైలు కు పంపించామని తెలిపారు. ఈ కేసు చేదనలో పాల్గొని నిందితులను గుర్తించిన అటవీశాఖ సిబ్బందికి అభినందనలు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :