Thursday, 22 May 2025 03:53:15 PM
# ఛత్తీస్‌గఢ్‌లో మళ్ళీ ఎన్‌కౌంటర్: బీజాపూర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతం # ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కేసీఆర్, హరీశ్ కీలక మంతనాలు! # ఒకే నెలలో 50 వేల మంది ఉద్యోగులకు ప్రమోషన్ ఇస్తున్న ప్రముఖ టెక్ సంస్థ # కుప్పకూలిన మార్కెట్లు: సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్, నిఫ్టీ 24,550 దిగువకు! # చంద్రబాబు ఏడాది పాలనపై జగన్ సంచలన ఆరోపణలు # రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు? # నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే # అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని # ఇండిగో విమానంలో భయానక వాతావరణం.. చావును దగ్గరగా చూశామన్న టీఎంసీ ఎంపీ సాగరిక # నిరుపేద పిల్లల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న మోహన్ లాల్

హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

ఘటనను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

Date : 24 January 2025 05:56 PM Views : 229

Studio18 News - TELANGANA / HYDERABAD : హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. కిడ్నీ రాకెట్‌ ముఠాల డొంక కదిలించేందుకు సిద్ధమైంది. తెలంగాణలో కొన్నేళ్లుగా జరిగిన అన్ని కిడ్నీ ఆపరేషన్లపై సీఐడీ విచారణకు ఆదేశించడం ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్‌ మహానగరంలోని సరూర్‌నగర్ అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో అనుమతి లేకుండా కిడ్పీ మార్పిడులు చేయడంతోపాటు.. గుట్టుచప్పుడు కాకుండా 55 లక్షలు రూపాయలు కాజేసేందుకు కొందరు కేటుగాళ్లు ప్రయత్నించడం సంచలనం సృష్టించింది. అయితే.. వైద్యశాఖ అధికారులకు సమాచారం అందడంతో గుట్టురట్టు అయింది. అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి జరిగినట్లు గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో.. అలకనంద ఆస్పత్రి యాజమాని సుమంత్ సహా 8మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించి కీలక విషయాలు రాబట్టారు. ఈ క్రమంలోనే.. అలకనంద ఆస్పత్రి ఎండీ సుమంత్‌, రిసెప్షనిస్ట్‌ గోపిని కోర్టులో హాజరుపర్చడంతో రిమాండ్‌ విధించారు న్యాయమూర్తి. పోలీసుల అదుపులో ఉన్న మరో ఆరుగురిని విచారిస్తున్నారు. కిడ్నీ డోనర్లు, గ్రహీతలకు సర్జరీ ఎక్కడ చేశారు? ఈ దందాలో ఇంకా ఎంతమంది ఉన్నారనే దానిపై పోలీసులు కూపీ తీస్తున్నారు. సర్జరీ చేసిన డాక్టర్ల కోసం ఆరు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇక.. కిడ్నీ రాకెట్ ఘటనలో తెలంగాణ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక వైద్యుల కమిటీ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చెన్నైకి చెందిన పూర్ణిమ మధ్యవర్తిగా ఉన్నట్టు కమిటీ విచారణలో తేలింది. దీనికి సంబంధించి హెల్త్ సెక్రటరీకి ప్రత్యేక వైద్యుల కమిటీ నివేదిక కూడా అందించింది. కిడ్నీ డోనర్లు, కిడ్నీ తీసుకున్నవారి వివరాలు సేకరించి.. వారికి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తేల్చారు. అటు.. అలకనంద ఆస్పత్రిని వైద్యాధికారులు సీజ్‌ చేశారు. మరోవైపు.. తెలంగాణలో కొన్నేళ్లుగా జరిగిన కిడ్నీ మార్పిడుల డొంక కదిలించేందుకు రేవంత్‌రెడ్డి సర్కార్‌ రెడీ అవుతోంది. అలకనంద ఆస్పత్రి ఘటనతో అలెర్ట్‌ అయిన ప్రభుత్వం.. ఇప్పటివరకు ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన కిడ్నీ మార్పిడి ఆపరేషన్లపై దర్యాప్తు చేయాలని ఆదేశించడం హాట్‌టాపిక్‌గా మారుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :