Sunday, 29 March 2026 05:24:10 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు

Date : 06 December 2025 06:59 PM Views : 315

Studio18 News - TELANGANA / HYDERABAD : అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతిని కాంగ్రెస్ నేతలు నిర్వహించారు. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నేత వి.హెచ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. నిన్న బీసీ రిజర్వేషన్ల కోసం.. తీన్మార్ మల్లన్న ఆఫీస్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై స్పందించారు. బీసీ రిజర్వేషన్ కోసం ఆత్మార్పణ చేసుకున్న సాయి ఈశ్వర్ చారి మృతికి నాయకులు సంతాపం తెలిపారు. బీసీ రిజర్వేషన్ కోసం ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలిపారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ను శంకించాల్సిన అవసరం లేదన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ కోసం పోరాడుతారని భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో బీసీలదే రాజ్యాధికారం అన్నారు. అలాగే కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నేత వీహెచ్ మాట్లాడుతూ.. కేంద్రంలోరాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది ఖాయం అని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. బీసీ రిజర్వేషన్లు సాధించుకుందాం అని.. బీసీ బిల్లు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి పార్లమెంటులో బిల్లు ఆమోదిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతందని.. అది రాహుల్ గాంధీ వల్లే సాధ్యం అవుతుందన్నారు. అనంతరం అంబర్పేట్ శ్రీ రమణ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి , నివాళులు అర్పించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :