Studio18 News - TELANGANA / RANGAREDDY : బి.ఎన్. రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాయిరాం కాలనీలో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను బి.ఎన్. రెడ్డి నగర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ లెవెల్ సరిచూసుకుంటూ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని, కాలనీ వాసులకు ఇబ్బందులు కలగకుండా వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రతి కాలనీ సమస్యల పరిష్కారం మరియు అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంజీవరెడ్డి, కల్చరల్ సెక్రటరీ శ్రీదేవి, రామ్ మూర్తి, అడ్వైజర్ జనార్ధన్, ఈసీ మెంబర్ రవీందర్, జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం వర్క్ ఇన్స్పెక్టర్ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News