Studio18 News - TELANGANA / VIKARABAD : వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్ మరియు కాలాపూర్ గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు పేరుతో సుమారు 1200 ఎకరాల వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకోవడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధిత రైతులు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కలిసి తమ సమస్యను వివరించారు. తమ జీవనాధారం అయిన భూములను తీసుకుంటే జీవనం సాగించడం కష్టమవుతుందని రైతులు తెలిపారు. తరతరాలుగా ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్నామని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేసి రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
Admin
Studio18 News