Friday, 14 February 2025 08:19:44 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

#nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

Date : 24 January 2025 06:26 PM Views : 50

Studio18 News - TELANGANA / NAGARKURNOOL : నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలంలోని బాలుర సాంఘీక గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని గురువారం రాత్రి నాగర్ కర్నూల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ దేవ సహాయం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వండిన భోజనాన్ని ఆయన పరిశీలించారు. టీచర్స్‌ మెస్‌ కమిటీతో భోజనం ఎలా ఉందో ఆరా తీశారు. బియాన్ని పరిశీలించి, బియ్యం స్టాక్‌ రిజిస్టర్‌ను చెక్‌ చేశారు. వండే బియ్యాన్ని ఒకరోజు ముందే శుభ్రం చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలని వంట ఏజెన్సీకి సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ ముచ్చటించారు. భవిష్యత్‌లో ఏం కావాలనుకుంటున్నారని, మీ ఆశయం ఏమిటని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పదవ తరగతి విద్యార్థుల స్టడీ అవర్స్‌ను పరిశీలించారు. గురుకుల పాఠశాలలో ఏ వైనా సమస్యలుంటే నివేదిక ఇవ్వాలని పాఠశాల ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. పాఠశాలలో చదువులు, వసతులు, సమస్యలు తదితర అంశాలను నిశితంగా ఆయన పరిశీలించారు. గురుకుల పాఠశాలలో పరిశుభ్రతపై అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యం పరిశుభ్రత అత్యంత కీలకమని సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారమే విద్యార్థులకు భోజనాన్ని అందించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి పాఠశాలలోనే రాత్రి బస చేసిన ఆయన విద్యార్థులకు ఏలాంటి సమస్యలు లేకుండా చూడాలంటూ నిర్వాహకులకు ఆదేశించారు.

Also Read : అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :