Sunday, 29 March 2026 05:20:30 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Boyalapalli Rekha | గణతంత్ర దినోత్సవంలో ప్రతిపక్ష నేతకు అవమానం.. ఆనవాయితీకి తూట్లు పొడిచిన ప్రధాని..!

హైదరాబాద్, జనవరి 29 : గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష నేతకు ముందు వరుస సీటు కేటాయించే సంస్కృతికి ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) తూ

Date : 30 January 2026 06:29 PM Views : 116

Studio18 News - TELANGANA / HYDERABAD : హైదరాబాద్, జనవరి 29 : గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష నేతకు ముందు వరుస సీటు కేటాయించే సంస్కృతికి ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) తూట్లు పొడిచారని కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు డా. రేఖ బోయలపల్లి (Boyalapalli Rekha) మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీకి ఉద్దేశపూర్వకంగా సీటు నిరాకరించడం ద్వారా మోదీ ఆయనను అవమానించారని పేర్కొన్న ఆమె.. మోడీ చర్యను తీవ్రంగా ఖండించారు. “ఇది సాధారణ ప్రోటోకాల్ లోపం కాదు. ఇది ప్రజాస్వామ్య సంప్రదాయాలు, రాజ్యాంగ విలువలకు విరుద్ధమైన రాజకీయ ప్రవర్తన, అలాగే బీజేపీ రాజకీయ సంస్కృతిలో చోటు చేసుకున్న ఆందోళనకరమైన మార్పునకు ప్రతీక” అని రేఖ ధ్వజమెత్తారు. 140 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో, అధికారంలో ఉన్నా లేదా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాస్వామ్య సంస్థలకు, రాజ్యాంగ విలువలకు, ప్రతిపక్ష గౌరవానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చామని ఆమె పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడిన రేఖ బోయలపల్లి ప్రతిపక్ష నేతపట్ల ఇంత అవమానకరంగా వ్యవహరించిన దాఖలాలు చరిత్రలో ఎన్నడూ లేవని ఈ సందర్భంగా గుర్తుచేశారు.ఆనవాయితీ ప్రకారం మోదీ తనకు ముందు వరుసలో సీటు నిరాకరించడంపై రాహుల్ గాంధీ హుందాగా స్పందించారని ఆమె అన్నారు. అది ఆయన సంస్కారం, ఆయనకున్న విలువలు, నాయకత్వానికి నిదర్శనమని డా. రేఖ పేర్కొన్నారు. “హుందాగా వ్యవహరించడం బలహీనత కాదు. సిద్ధాంతాలు, విలువలపై నిర్మితమైన బలమైన నాయకత్వానికి ప్రతిరూపం,” అని ఆమె స్పష్టం చేశారు. దేశానికి అవసరమైనవి విభజన, అవమానం, అహంకార రాజకీయాలు కాదుని.. ఐక్యత, సమన్వయం, గౌరవం, ప్రజాస్వామ్యం బలోపేతమే లక్ష్యంగా పనిచేసే రాహుల్ గాంధీ నాయకత్వం అని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :