Tuesday, 10 March 2026 03:37:25 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం

Date : 10 March 2026 02:08 PM Views : 26

Studio18 News - TELANGANA / JAGTIAL : జగిత్యాల జిల్లా కేంద్రంలో మృతి చెందిన శతాధిక వృద్ధురాలు అర్వపెల్లి అమృతా భాయి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు కరీంనగర్ మెడికల్ కాలేజ్‌కు అందజేశారు. జగిత్యాల పట్టణంలోని అరవింద్ నగర్‌కు చెందిన అర్వపెల్లి అమృతాభాయి (100) గత కొంతకాలంగా వయోభారంతో అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, మంచాల కృష్ణ, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ సమక్షంలో కరీంనగర్ మెడికల్ కాలేజీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆమె పార్థివ దేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ, మానవ శరీర దానం అనేది వైద్య విద్య మరియు శాస్త్రీయ పరిశోధన కోసం మనిషి సహజ మరణానంతరం మొత్తం మృత శరీరాన్ని వైద్య విద్యార్థులకోసం వైద్య కళాశాలకు దానం చేయడం హర్షించదగ్గ విషయం అని అన్నారు. దేశంలోని అనాటమీ చట్టం ప్రకారం భవిష్యత్ వైద్యులకు శిక్షణ ఇవ్వడానికి మరియు కొత్త శస్త్రచికిత్సా పద్ధతులను అభివృద్ధి చేయడానికి ఇది చాలా ముఖ్యమని వెల్లడించారు. దానం చేయబడిన మృత శరీరాలను వైద్య విద్యార్థులు శరీర నిర్మాణ శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారని, మానవ శరీర నిర్మాణం మరియు అది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి వారికి ఎంతో సహాయపడుతుందని తెలిపారు. అలాగే కొత్త వైద్య పరికరాలను అభివృద్ధి చేయడానికి మరియు వినూత్న శస్త్రచికిత్సా విధానాలను అభ్యసించడానికి వైద్య పరిశోధకులు కూడా వీటిని ఉపయోగిస్తారని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :