Thursday, 22 May 2025 04:10:30 PM
# 53 లక్షల చ.అ. విస్తీర్ణంతో సచివాలయం అవసరమా?: జగన్ # కారు వెనుక నక్కి సల్మాన్ ఖాన్ ఇంట్లోకి దూరే యత్నం.. వ్యక్తి అరెస్టు # రేషన్ కార్డుకు పెళ్లి సర్టిఫికెట్ కావాలా.. మంత్రి నాదెండ్ల ఏం చెబుతున్నారంటే...! # ఛత్తీస్‌గఢ్‌లో మళ్ళీ ఎన్‌కౌంటర్: బీజాపూర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతం # ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కేసీఆర్, హరీశ్ కీలక మంతనాలు! # ఒకే నెలలో 50 వేల మంది ఉద్యోగులకు ప్రమోషన్ ఇస్తున్న ప్రముఖ టెక్ సంస్థ # కుప్పకూలిన మార్కెట్లు: సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్, నిఫ్టీ 24,550 దిగువకు! # చంద్రబాబు ఏడాది పాలనపై జగన్ సంచలన ఆరోపణలు # రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు? # నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే

కేసీఆర్ ను ఫినిష్ చేస్తానని రేవంత్ అంటున్నారు: కేటీఆర్

కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదన్న కేటీఆర్ రేవంత్ మాదిరే ఎంతో మంది ప్రగల్భాలు పలికారని ఎద్దేవా కేసీఆర్ ను ఫినిష్ చేస్తామన్నవారే ఫినిష్ అయిపోయా

Date : 16 November 2024 04:55 PM Views : 137

Studio18 News - TELANGANA / : కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను ఫినిష్ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారని... కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ మాదిరే గత 24 ఏళ్లలో ఎంతో మంది ప్రగల్భాలు పలికారని, పిచ్చి ప్రేలాపనలు చేశారని... కేసీఆర్ ను ఫినిష్ చేస్తామన్నవారే ఫినిష్ అయిపోయారని చెప్పారు. చరిత్రలోకి తొంగిచూడాలని రేవంత్ కు హితవు పలికారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పలువురు కాంగ్రెస్ నేతలు ఈరోజు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంట పిడికెడు మంది మాత్రమే ఉన్నారని... ఈనాడు లక్షలాది కార్యకర్తలు ఉన్నారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి కులంగా, సంక్షేమం మతంగా, అందరినీ కలుపుకునిపోయి పాలన కొనసాగిందని చెప్పారు. అన్ని రంగాల్లో దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ నిలిచిందని అన్నారు. పదేళ్ల పాటు కేసీఆర్ పాలన అద్భుతంగా కొనసాగిందని చెప్పారు. అధికారం, పదవులు శాశ్వతం కాదని... ప్రజల గుండెల్లో సంపాదించుకున్న స్థానం శాశ్వతంగా ఉంటుందని కేటీఆర్ అన్నారు. ఆ శాశ్వత స్థానం కేసీఆర్ కు మాత్రమే సొంతమని చెప్పారు. పదవుల కోసం కొందరు ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా... పార్టీని వదిలిపెట్టకుండా ఉన్న గులాబీ సైనికులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు.

Also Read : నారా రామ్మూర్తినాయుడి మృతిపై ఏపీ మంత్రుల దిగ్భ్రాంతి

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :