Tuesday, 18 March 2025 12:26:59 AM
# Seethakka: విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణ # Telangana Govt: తెలంగాణ శాస‌న‌స‌భ‌లో కీల‌క బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌భుత్వం # Revanth Reddy: అందుకే తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించాం!: రేవంత్ రెడ్డి # Akbaruddin Owaisi: అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్‌లా కాదు: అక్బరుద్దీన్ ఒవైసీ # Court: నానిగారి కోసం 8 నెలలు వెయిట్ చేశాను: 'కోర్ట్' డైరెక్టర్ రామ్ జగదీశ్! # Chandrababu: అందులో ఒక శాతం నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నా: సీఎం చంద్రబాబు # Narendra Modi: ప్రధాని మోదీ ఎదుట గాయత్రీ మంత్రాన్ని పఠించిన అమెరికన్ ఏఐ పరిశోధకుడు ఫ్రిడ్‌మాన్ # Monkey: శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి... ఫోన్ సొంతదారు ఏంచేశాడంటే...! # Annapurnamma: అత్యాశకు పోతే అవస్థలు తప్పవు మరి: నటి అన్నపూర్ణ # DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ # Gauri Spratt: తాను ఆమిర్ ఖాన్‌తో ఎందుకు ప్రేమ‌లో పడ్డానో చెప్పిన గౌరీ స్ప్ర‌త్‌ # Ravichandran Ashwin: ధోనీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు: అశ్విన్ # Corbin Bosch: ముంబయి ఇండియన్స్ ప్లేయ‌ర్‌కు పీసీబీ నోటీసులు... కార‌ణ‌మిదే! # Hyderabad Metro: ఆ యాడ్స్ తొలగించేలా చూడాలంటూ సజ్జనార్ కు నెటిజన్ల విజ్ఞప్తి # Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్

గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన నాలుగు అంతస్తుల భవనం.. ప్రాణ భయంతో జనం పరుగులు..

పక్కనే మరో బిల్డింగ్ నిర్మాణ పనులు చేపట్టడమే కారణం మంగళవారం రాత్రి ఘటన.. రంగంలోకి దిగిన హైడ్రా, జీహెచ్ఎంసీ బృందాలు బుధవారం బిల్డింగ్ కూ

Date : 20 November 2024 12:32 PM Views : 77

Studio18 News - TELANGANA / : హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఓ నాలుగు అంతస్తుల భవనం మంగళవారం రాత్రి పక్కకు ఒరిగింది. బిల్డింగ్ కూలిపోతోందని భయాందోళనకు గురైన జనం ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఆ బిల్డింగ్ లో ఉంటున్న వారు ఉన్నపళంగా బయటపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మణికొండకు చెందిన లక్ష్మణ్ రెండేళ్ల క్రితం సిద్ధిఖీ నగర్ లో తనకున్న 60 గజాల స్థలంలో నాలుగు అంతస్తుల భవనం నిర్మించాడు. అందులో పలు కుటుంబాలు కిరాయికి ఉంటున్నాయి. మొత్తం 30 మంది ఆ బిల్డింగ్ లో ఉంటున్నారు. లక్ష్మణ్ ఇంటి పక్కనే ఇటీవల మరో బిల్డింగ్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. సెల్లార్ కోసం భారీ గుంత తవ్వడంతో మంగళవారం రాత్రి లక్ష్మణ్ కు చెందిన నాలుగు అంతస్తుల బిల్డింగ్ కాస్తా పక్కకు ఒరిగింది. దీంతో అందులోని కిరాయిదారులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. మూడో అంతస్తులోని ఇక్బాల్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి భయంతో పైనుంచి కిందకు దూకాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ హుస్సేన్ ను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. చుట్టుపక్కల బిల్డింగ్ లలో ఉంటున్న వారు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు ముందుజాగ్రత్త చర్యగా చుట్టుపక్కల ఇళ్లల్లో ఉంటున్న వారిని కూడా ఖాళీ చేయించారు. పక్కకు ఒరిగిన బిల్డింగ్ ను బుధవారం ఉదయం హైడ్రాలిక్ మిషిన్ సాయంతో కూల్చివేత చేపట్టారు. పొలం అమ్మి కట్టుకున్నాం.. ఊరిలో ఉన్న పొలం అమ్మి రెండేళ్ల క్రితమే భవనం కట్టుకున్నామని సదరు బిల్డింగ్ యజమాని స్వప్న చెప్పారు. తమ ఇంటి పక్కనే భారీ గుంత తవ్వడంతో ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. బిల్డింగ్ కూలితే చుట్టుపక్కల వారికి ఇబ్బంది, ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి అధికారులు కూల్చివేత చేపట్టడంపై తనకు అభ్యంతరం లేదన్నారు. అయితే, బిల్డింగ్ పక్కకు ఒరగడానికి కారణం పక్కనే జరుగుతున్న నిర్మాణ పనులే కాబట్టి సదరు స్థలం యజమాని నుంచి తనకు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. పొలం అమ్మి, అప్పు చేసి కట్టుకున్న బిల్డింగ్ కోల్పోయామని, పరిహారం ఇవ్వకుంటే తన కుటుంబం రోడ్డున పడాల్సిందేనని స్వప్న ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభం

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :