Monday, 23 June 2025 02:57:24 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

Dharmapuri Arvind: హైడ్రా తీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయ వేసింది: ధర్మపురి అర్వింద్

Date : 01 October 2024 03:25 PM Views : 114

Studio18 News - TELANGANA / : హైడ్రా తీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయ వేసిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లనే కూల్చేస్తున్నారని, బ్లాక్‌మెయిల్ చేసి జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బీజేపీ చేపట్టిన 'రైతుదీక్ష' ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి పాలన కూడా కేసీఆర్ పాలనలాగే ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రైతు గోసను తెలియజేసేందుకే బీజేపీ ఆధ్వర్యంలో ఈ దీక్షను చేపట్టామన్నారు. రైతుల ఆదాయాన్ని ప్రధాని మోదీ రెట్టింపు చేశారన్నారు. చిన్న చిన్న పంటలకు ఏమీ చేయలేని ప్రభుత్వాన్ని నిన్న కేసీఆర్ నడిపారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి నడుపుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు కనీసం చిన్నకారు రైతుని కూడా ఆదుకోలేకపోయాయని అన్నారు. రైతుల హామీల సాధన కోసం తెలంగాణ బీజేపీ ప్రతినిధులు చేపట్టిన 24 గంటల దీక్ష కాంగ్రెస్ కుంభస్థలంపై కుంపటిగా మారిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేదాకా బీజేపీ వదిలిపెట్టదని హెచ్చరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :