Studio18 News - TELANGANA / HYDERABAD : ఆర్మూర్ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పెన్షనర్స్ సంఘ భవనం నుండి ర్యాలీగా వెళ్లి పెన్షనర్స్ హక్కుల సాధనకై సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఆర్మూర్ విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్, కోశాధికారి నవజీవన్, గౌరవ అధ్యక్షులు రాంరెడ్డి, జిల్లా కార్యదర్శి కరుణ సాగర్ రెడ్డి, రాఘవేందర్, స్టేట్ కౌన్సిలర్ పుష్పకర్ రావు తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ 2026 జనవరి 1కి ముందు మరియు తర్వాత పదవీ విరమణ పొందిన వారిని వేర్వేరుగా వర్గీకరించడం ద్వారా 7వ వేతన సవరణ సంఘం ప్రయోజనాలను పరిమితం చేసే ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ నిర్ణయానికి నిరసనగా పెన్షనర్స్ అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి మార్చి 25ను బ్లాక్ డేగా పాటించామని చెప్పారు. ఒకే విధమైన సేవలు చేసిన ఉద్యోగుల మధ్య భేదభావం సృష్టించడం సరైన పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు పెరుగుతాయని, అలాంటి సమయంలో పింఛన్పైనే ఆధారపడి జీవించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వాలిడిటీ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ యు. సాయన్న, మోహన్ రావు, నర్సిములు, నర్సయ్య, గంగాధర్, కోటేశ్వర్, సుధాకర్, ముత్తెన్న, ఎంసి ఓబన్న, జింధం నరహరి, బ్రహ్మయ్య, రమేష్, సుదర్శన్, రామ్మూర్తి, సత్తయ్య, మల్కన్న, సదానంద్, దివాకర శర్మ, లింబాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News