Saturday, 07 March 2026 09:18:50 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

KDCC Bank: రూ.78లక్షలు స్వాహా.. ఆత్మకూరు కేడీసీసీ బ్యాంకు అధికారులపై క్రిమినల్ కేసు

Date : 08 October 2024 11:41 AM Views : 431

Studio18 News - ANDHRA PRADESH / : Atmakuru KDCC Bank: నంద్యాల జిల్లా ఆత్మకూరు కేడీసీసీ బ్యాంకు బ్రాంచ్ లో ముగ్గురు అధికారులపై క్రిమినల్ కేసు నమోదైంది. బ్యాంకు డీజీఎం ఉమామహేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు మేనేజర్ పులిరాజు, క్యాషియర్ అల్తాఫ్, పాసింగ్ ఆఫీసర్ రంగయ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మకూరు బ్రాంచ్ లో క్యాషియర్ రూ. 78,77,767 కాజేశాడు. అయితే, నిర్లక్ష్యంగా వ్యవహరించి నందుకు బ్రాంచ్ మేనేజర్, పాసింగ్ ఆఫీసర్ పైనా కేసు నమోదు చేశారు. బ్యాంకు డబ్బును తన సొంత అవసరాలకు, వ్యాపారం పేరుతో స్వాహా చేసిన ప్రధాన ముద్దాయి, క్యాషియర్ ఎస్. అల్తాఫ్ ను ఏ1గా, లాకర్ లో డబ్బు మాయమవుతున్నా పట్టించుకోని పాసింగ్ ఆఫీసర్ వి. వెంకటరంగయ్యను ఎ2గా, పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యంగా వ్యవహరించిన మేనేజర్ పులిరాజును ఎ3గా చేర్చారు. ఈ ముగ్గురిపై నమోదైన కేసు నమోదుకు సంబంధించిన సమగ్ర వివరాలను నంద్యాల జిల్లా కలెక్టర్ కు బ్యాంకు సీఈవో నివేదించినట్లు తెలిసింది. అవినీతికి పాల్పడిన ఉద్యోగులను సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :