Tuesday, 11 November 2025 04:54:04 PM
# Jubilee Hills Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం # Ande Sri: అందెశ్రీ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందన # Rajyalaxmi: అమెరికాలో ఏపీ విద్యార్థిని మృతి.. ఆదుకునేందుకు కదిలిన ప్రవాస భారతీయులు # Nara Lokesh: ఇది కల్తీ కాదు... హిందువుల విశ్వాసంపై ఉద్దేశపూర్వక దాడి: మంత్రి నారా లోకేశ్ # Stock Market: ఐటీ, ఆటో షేర్ల జోరు... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ # Pakistan: నేపాల్, బంగ్లాదేశ్‌లలో... భారత్ చుట్టూ ఉగ్రవాద విస్తరణకు పాక్ కుట్ర # Harish Rao: రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడినా.. జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరికి ఓటేయాలో ముందే నిర్ణయించుకున్నారు: హరీశ్ రావు # Kommareddi Pattabhiram: రసాయన నెయ్యిని శ్రీవారి ప్రసాదంలో ఉపయోగించి ఇంకా సమర్ధించుకుంటారా?: వైసీపీపై పట్టాభి ఫైర్ # Sri Bharat: బుద్ధి చెప్పినా వైసీపీ నేతలు మారలేదు.. పెట్టుబడుల సదస్సును అడ్డుకోవాలనుకుంటున్నారు: శ్రీభరత్ 10 # Chandrababu Naidu: అమరావతి-విశాఖ ఎకనామిక్ రీజియన్... సీఎం చంద్రబాబు కీలక సమీక్ష # Meena: మిథున్ చక్రవర్తి సినిమా చేయమని అడిగితే భయపడ్డా.. ఆయన హోటల్‌కే వెళ్లలేదు: నటి మీనా # Khushboo Ahirwar: సహజీవనం చేస్తున్న మోడల్ అనుమానాస్పద మృతి # Chandrababu Naidu: మంత్రులను ప్రశంసించిన ముఖ్యమంత్రి చంద్రబాబు # Sunil Gavaskar: ఆ నగదు అందకపోతే నిరాశవద్దు: మహిళా జట్టుకు సునీల్ గవాస్కర్ కీలక సందేశం # Ambati Rambabu: తిరుమల అన్నప్రసాదంపై నా వ్యాఖ్యలను వక్రీకరించారు: మీడియాపై అంబటి ఫైర్ # Nalgonda: నల్గొండ జిల్లాలో ఉల్లిపాయల లారీ బోల్తా.. బస్తాలను ఎత్తుకెళ్లిన వాహనదారులు # 'మహారాణి 4'( సోనీ లివ్) వెబ్ సిరీస్ రివ్యూ! # Nadenla Manohar: ధాన్యం కొనుగోలుపై మంత్రి నాదెండ్ల సమీక్ష... గోడౌన్లు సిద్ధం చేయాలని ఆదేశం # Dharmendra: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఆరోగ్యంపై వార్తలను ఖండించిన నటుడి టీమ్ # Mahesh Babu: మహేశ్ బాబు-రాజమౌళి చిత్రం... 50 వేల మందితో అత్యంత భారీ ఈవెంట్

రంగుల కోసం రూ.101 కోట్లు ఖర్చు చేశారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

మండలి సమావేశాలకు హాజరైన పవన్ సచివాలయాలకు రంగులు వేసేందుకు, తొలగించేందుకు రూ.101 కోట్లు అని వెల్లడి హైకోర్టు ఆదేశాలతో పార్టీ రంగులు తొలగిం

Date : 19 November 2024 03:19 PM Views : 254

Studio18 News - ANDHRA PRADESH / : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు శాసనమండలి సమావేశాలకు హాజరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయాలకు రంగుల అంశంపై మండలిలో ఆయన సమాధానమిచ్చారు. గతంలో సచివాలయాలకు రంగులు వేసేందుకు, వేసిన రంగులు తొలగించేందుకు రూ.101.81 కోట్లు ఖర్చు చేశారని వెల్లడించారు. రంగులు వేసేందుకు రూ.49.8 కోట్లు... రంగులు తొలగించేందుకు 52.73 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. ఇతర కార్యాలయాలకు కూడా రంగులు వేశారని, ఆ ఖర్చును సంబంధిత శాఖలు తెలియజేస్తాయని పవన్ తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో పార్టీ రంగులు తొలగించి నిర్దేశిత రంగులు వేయడం జరిగిందని పేర్కొన్నారు. కామన్ డంపింగ్ యార్డుల ఏర్పాటుకు చర్యలు గ్రామాల్లో డంపింగ్ యార్డులపైనా శాసనమండలిలో చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జవాబిచ్చారు. గ్రామాల్లో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణకు నిధులు ఇచ్చామని వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘం నిధులను సంపద సృష్టి కేంద్రాలకు కేటాయించామని తెలిపారు. చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చామని వివరించారు. గ్రామాలు స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డు కోసం గ్రామాల్లో స్థల సేకరణ కష్టంగా ఉందని, డంపింగ్ యార్డుల సమస్యను కచ్చితంగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. 10 నుంచి 12 గ్రామాలకు కలిపి కామన్ గా డంపింగ్ యార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు పవన్ కల్యాణ్ వెల్లడించారు.

Also Read : శృంగేరి శారదా పీఠానికి వెళ్లనున్న జగన్

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :