Thursday, 22 May 2025 04:16:03 PM
# నటి అనసూయ ఇంట్లో మరో వేడుక # 53 లక్షల చ.అ. విస్తీర్ణంతో సచివాలయం అవసరమా?: జగన్ # కారు వెనుక నక్కి సల్మాన్ ఖాన్ ఇంట్లోకి దూరే యత్నం.. వ్యక్తి అరెస్టు # రేషన్ కార్డుకు పెళ్లి సర్టిఫికెట్ కావాలా.. మంత్రి నాదెండ్ల ఏం చెబుతున్నారంటే...! # ఛత్తీస్‌గఢ్‌లో మళ్ళీ ఎన్‌కౌంటర్: బీజాపూర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతం # ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కేసీఆర్, హరీశ్ కీలక మంతనాలు! # ఒకే నెలలో 50 వేల మంది ఉద్యోగులకు ప్రమోషన్ ఇస్తున్న ప్రముఖ టెక్ సంస్థ # కుప్పకూలిన మార్కెట్లు: సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్, నిఫ్టీ 24,550 దిగువకు! # చంద్రబాబు ఏడాది పాలనపై జగన్ సంచలన ఆరోపణలు # రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు?

AP Rains: ఏపీలో భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల వారికి అలెర్ట్

Date : 15 October 2024 10:38 AM Views : 113

Studio18 News - ANDHRA PRADESH / : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే ఆవకాశం ఉంది. రాగల 48 గంటల పాటు దక్షిణాకోస్తాంద్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఉత్తర కోస్తాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఆవకాశం ఉంది. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం చెప్పింది. ఇవాళ పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లా­ల్లోని పలు ప్రాంతాల్లోవర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతా­రామ­రాజు, విశాఖపట్నం సహా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురియొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లాలో జిల్లాలో సగటు వర్షపాతం 96.8 మి.మీ.గా నమోదైంది. జలదంకిలో అత్యధికంగా వర్షపాతం 177.6 మి.మీ.గా, సీతారాంపురంలో అత్యల్ప వర్షపాతం 40.4 మి.మీ.గా నమోదైంది. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. జీరో హ్యూమన్ లాస్, మినిమం డామేజ్ ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. పలుచోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు కలెక్టర్ ఆనంద్ సూచించారు. స్కూల్స్, జూనియర్ కాలేజీలకు కలెర్టర్ సెలవు ప్రకటించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోనున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :