Saturday, 26 April 2025 06:47:42 AM
# హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

YS Jagan: రాష్ట్రంలో ఘోర‌మైన ప‌రిస్థితులు.. రెడ్‌బుక్ పాల‌న సాగుతోంది: వైఎస్ జ‌గ‌న్‌

Date : 23 October 2024 04:33 PM Views : 99

Studio18 News - ANDHRA PRADESH / : గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువ‌తి స‌హానా.. రౌడీషీట‌ర్ న‌వీన్ దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డి మృతిచెందిన విష‌యం తెలిసిందే. గుంటూరు జీజీహెచ్‌లో ఉన్న ఆమె మృత‌దేహాన్ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ప‌రిశీలించారు. మృతురాలి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. పార్టీ త‌ర‌ఫున స‌హానా ఫ్యామిలీని ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు వివిధ ఘ‌ట‌న‌లలో చ‌నిపోయిన ఆరుగురు ఆడ‌పిల్ల‌ల కుటుంబాల‌కు వైసీపీ త‌ర‌ఫున రూ.10ల‌క్ష‌లు ఆర్థిక సాయం ఇస్తామ‌న్నారు. అనంత‌రం జ‌గ‌న్ విలేక‌రులతో మాట్లాడారు. రాష్ట్రంలో దారుణ‌ప‌రిస్థితులు ఉన్నాయ‌ని, రెడ్‌బుక్ పాల‌న సాగుతుంద‌ని విమ‌ర్శించారు. స‌హానా మృత‌దేహాన్ని ప‌రిశీలించిన త‌న‌కు ఆమె శ‌రీరంపై క‌మిలిన గాయాలు క‌నిపించాయ‌న్నారు. ఆమెపై అఘాయిత్యానికి పాల్ప‌డి, ఆసుప‌త్రిలో చేర్పించి వెళ్లిపోయార‌ని ఆరోపించారు. ఆమె మృతికి కార‌ణ‌మైన న‌వీన్ టీడీపీకి చెందిన వాడ‌ని, అత‌ను స్థానిక ఎంపీతో స‌న్నిహితంగా ఉండేవాడ‌ని ఆరోపించారు. సీఎం చంద్ర‌బాబుతో క‌లిసి అత‌ను దిగిన ఫొటోలు కూడా ఉన్నాయ‌న్నారు. నిందితుడు త‌మ పార్టీకి చెందిన‌వాడు కావ‌డంతోనే టీడీపీ నిస్సిగ్గుగా అత‌డ్ని కాపాడాల‌ని చూస్తోంద‌ని జ‌గ‌న్ దుయ్య‌బ‌ట్టారు. ఇంత‌వ‌ర‌కూ మృతురాలి కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే, హోంమంత్రి ఎవ‌రూ ప‌రామ‌ర్శించ‌క‌పోవ‌డం శోచ‌నీయం అని జ‌గ‌న్ పేర్కొన్నారు. కూట‌మి ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు ఎంత‌కు దిగ‌జారిపోయాయో ద‌ళిత మ‌హిళ‌ల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో మ‌హిళ‌ల‌కు దిశ‌యాప్ ద్వారా భ‌ద్ర‌త క‌ల్పించిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ గుర్తు చేశారు. వైసీపీ ప్ర‌భుత్వంలో ఆడ‌వాళ్ల‌కు ర‌క్ష‌ణ ఉండేద‌న్నారు. ఇదిలాఉంటే.. నిందితుడు న‌వీన్‌ను తెనాలి పోలీసులు ఇప్ప‌టికే అదుపులోకి తీసుకున్నారు. స‌హానా-న‌వీన్ మ‌ధ్య అప్పు విష‌య‌మై ఉన్న త‌గాదాలే ఆమె హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు వెల్ల‌డించారు. అలాగే టీడీపీతో న‌వీన్‌కు ఎలాంటి సంబంధం లేద‌ని పోలీసులు తెలిపారు. ఇంత స్ప‌ష్టంగా పోలీసులు చెబుతున్నా.. వైసీపీ నాయ‌కులు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :