Saturday, 07 March 2026 08:27:18 PM
# కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా

YS Jagan: రాష్ట్రంలో ఘోర‌మైన ప‌రిస్థితులు.. రెడ్‌బుక్ పాల‌న సాగుతోంది: వైఎస్ జ‌గ‌న్‌

Date : 23 October 2024 04:33 PM Views : 431

Studio18 News - ANDHRA PRADESH / : గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువ‌తి స‌హానా.. రౌడీషీట‌ర్ న‌వీన్ దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డి మృతిచెందిన విష‌యం తెలిసిందే. గుంటూరు జీజీహెచ్‌లో ఉన్న ఆమె మృత‌దేహాన్ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ప‌రిశీలించారు. మృతురాలి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. పార్టీ త‌ర‌ఫున స‌హానా ఫ్యామిలీని ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు వివిధ ఘ‌ట‌న‌లలో చ‌నిపోయిన ఆరుగురు ఆడ‌పిల్ల‌ల కుటుంబాల‌కు వైసీపీ త‌ర‌ఫున రూ.10ల‌క్ష‌లు ఆర్థిక సాయం ఇస్తామ‌న్నారు. అనంత‌రం జ‌గ‌న్ విలేక‌రులతో మాట్లాడారు. రాష్ట్రంలో దారుణ‌ప‌రిస్థితులు ఉన్నాయ‌ని, రెడ్‌బుక్ పాల‌న సాగుతుంద‌ని విమ‌ర్శించారు. స‌హానా మృత‌దేహాన్ని ప‌రిశీలించిన త‌న‌కు ఆమె శ‌రీరంపై క‌మిలిన గాయాలు క‌నిపించాయ‌న్నారు. ఆమెపై అఘాయిత్యానికి పాల్ప‌డి, ఆసుప‌త్రిలో చేర్పించి వెళ్లిపోయార‌ని ఆరోపించారు. ఆమె మృతికి కార‌ణ‌మైన న‌వీన్ టీడీపీకి చెందిన వాడ‌ని, అత‌ను స్థానిక ఎంపీతో స‌న్నిహితంగా ఉండేవాడ‌ని ఆరోపించారు. సీఎం చంద్ర‌బాబుతో క‌లిసి అత‌ను దిగిన ఫొటోలు కూడా ఉన్నాయ‌న్నారు. నిందితుడు త‌మ పార్టీకి చెందిన‌వాడు కావ‌డంతోనే టీడీపీ నిస్సిగ్గుగా అత‌డ్ని కాపాడాల‌ని చూస్తోంద‌ని జ‌గ‌న్ దుయ్య‌బ‌ట్టారు. ఇంత‌వ‌ర‌కూ మృతురాలి కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే, హోంమంత్రి ఎవ‌రూ ప‌రామ‌ర్శించ‌క‌పోవ‌డం శోచ‌నీయం అని జ‌గ‌న్ పేర్కొన్నారు. కూట‌మి ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు ఎంత‌కు దిగ‌జారిపోయాయో ద‌ళిత మ‌హిళ‌ల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో మ‌హిళ‌ల‌కు దిశ‌యాప్ ద్వారా భ‌ద్ర‌త క‌ల్పించిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ గుర్తు చేశారు. వైసీపీ ప్ర‌భుత్వంలో ఆడ‌వాళ్ల‌కు ర‌క్ష‌ణ ఉండేద‌న్నారు. ఇదిలాఉంటే.. నిందితుడు న‌వీన్‌ను తెనాలి పోలీసులు ఇప్ప‌టికే అదుపులోకి తీసుకున్నారు. స‌హానా-న‌వీన్ మ‌ధ్య అప్పు విష‌య‌మై ఉన్న త‌గాదాలే ఆమె హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు వెల్ల‌డించారు. అలాగే టీడీపీతో న‌వీన్‌కు ఎలాంటి సంబంధం లేద‌ని పోలీసులు తెలిపారు. ఇంత స్ప‌ష్టంగా పోలీసులు చెబుతున్నా.. వైసీపీ నాయ‌కులు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :