Wednesday, 19 March 2025 06:26:23 PM
# 'క్రష్డ్ ' (అమెజాన్ మినీ ప్లేయర్) సిరీస్ రివ్యూ! # Parag Shah: మన దేశంలో అత్యంత ధనిక ఎమ్మెల్యే... అత్యంత పేద ఎమ్మెల్యే.... ఎవరో తెలుసా...! # KTR: ప్రగతి రథానికి పంక్చర్ వేశారు... తెలంగాణ బడ్జెట్‌పై స్పందించిన కేటీఆర్ # Momo Factory: పంజాబ్‌లో షాకింగ్ ఘ‌ట‌న‌.. మోమోస్ త‌యారీ కేంద్రంలో కుక్క మాంసం...! # Bandi Sanjay: ఆరు గ్యారెంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్ ఉంది: బండి సంజయ్ # Realme: కొత్త ఫోన్ ను మార్కెట్లోకి వదిలిన రియల్ మీ... బ్యాంక్ ఆఫర్లతో రూ.2 వేల డిస్కౌంట్! # Vodafone Idea 5G : Vi యూజర్లకు గుడ్ న్యూస్.. వోడాఫోన్ ఐడియా 5G సేవలు మీకోసం.. కొత్త ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు ఇవే..! # Infinix Note 50X 5G : కొత్త ఫోన్ కావాలా? ఈ నెల 27న ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఫోన్ వచ్చేస్తోంది.. డిజైన్, కలర్ ఆప్షన్లు ఇవేనట..! # Aadhaar Update : మీకు కొత్తగా పెళ్లి అయిందా? మీ ఆధార్ పేరు, అడ్రస్ మార్చుకోలేదా? ఆన్‌లైన్‌లో ఇలా అప్‌డేట్ చేసుకోండి.. సింపుల్ ప్రాసెస్ మీకోసం.! # JioCinema Subscription : జియో యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఈ రీఛార్జ్ ప్లాన్లలో ఇకపై ‘జియోసినిమా’ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఉండదు.. చెక్ చేసుకోండి! # Pawan Kalyan: టీడీపీని ఈయనే గెలిపించాడంట... నాశనానికి ముందు ఇలాంటి గర్వమే వస్తుంది: కేఏ పాల్ # Election Commission of India: ఆధార్ తో ఓటరు కార్డు అనుసంధానానికి మొగ్గు చూపిన ఎన్నికల సంఘం # Rahul Gandhi: మహా కుంభమేళాపై మోదీ మాటలకు నేను మద్దతిస్తాను... కానీ!: రాహుల్ గాంధీ # Vijay Sai Reddy: మరోసారి విజయసాయి రెడ్డికి సీఐడీ నోటీసులు # YS Sharmila: అప్పుడు జగన్ చేసిన తప్పే ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నారు: షర్మిల # Andhra Pradesh: తక్కువ ద్రవ్యోల్బణం నమోదవుతున్న రాష్ట్రాలలో నాలుగో స్థానంలో ఏపీ # Indian Labor Unions: ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మే 20న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు # Nidhi Agarwal: బెట్టింగ్ యాప్ వ్యవహారం... నిధి అగర్వాల్ పైనా కేసు తప్పదా...? # Chandrababu Naidu: ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్... రేపు మోదీ, బిల్ గేట్స్ లను కలవనున్న ఏపీ సీఎం # New Delhi: అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ

Gajjela Venkata Lakshmi: ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్ గజ్జెల లక్ష్మి రాజీనామా

Date : 24 September 2024 04:47 PM Views : 56

Studio18 News - ANDHRA PRADESH / : ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గజ్జెల వెంకట లక్ష్మి తన పదవికి రాజీనామా చేశారు. నిజానికి ఆగస్టు నెలలోనే ఆమె పదవీకాలం ముగిసిపోయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఏపీ ప్రభుత్వం నిన్న (సోమవారం) మెమో జారీ చేసింది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి మెమో జారీ చేసిన నేపథ్యంలో ఆమె ఇవాళ రాజీనామా చేశారు. పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. చైర్‌పర్సన్ పదవీకాలం ముగిసిపోవడంతో కమిషన్‌లోని మిగతా సభ్యుల పదవీకాలం కూడా ముగిసిపోయినట్టేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ బాధ్యతలు స్వీకరించారు. 2024 ఆగస్టు 25 వరకు ఆమె పదవిలో కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం దిగిపోవడంతో మార్చి నెలలోనే వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. ఆమె స్థానంలోనే గజ్జెల లక్ష్మి నియమితులయ్యారు. పదవీకాలం ఆగస్టులోనే ముగిసిపోయినప్పటికీ లక్ష్మి కొనసాగడంతో ప్రభుత్వం మెమో జారీ చేసింది. కాగా ముంబై నటి కాదాంబరి జెత్వానీ వ్యవహారంపై గజ్జెల లక్ష్మి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇతర రాష్ట్రాల మహిళల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని, సుమోటోగా తీసుకోలేమని అనడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :