Saturday, 07 March 2026 08:06:54 PM
# డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు # వరంగల్ జేపీఎన్ రోడ్డులో ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం # మందమర్రి CER క్లబ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # గజ్వేల్ ఎంఆర్ఓ ఇంటిపై ఏసీబీ దాడులు

జగన్ అధికారాన్ని అడ్డంపెట్టుకుని పోలీసులతో చేయకూడని పనులన్నీ చేయించారు: రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీ

Date : 09 June 2025 03:45 PM Views : 187

Studio18 News - ANDHRA PRADESH / : జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసులతో చేయకూడని పనులన్నీ చేయించారని, తప్పుడు కేసులు పెట్టించారని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. గుంటూరు జనచైతన్య వేదిక హాలులో 'పోలీసు వ్యవస్థలో సంస్కరణలు' అనే అంశంపై నిన్న జరిగిన చర్చా గోష్ఠిలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జగన్‌పై అనేక కేసులు ఉన్నా చట్టంలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకుని ఏడేళ్లుగా న్యాయస్థానానికి వెళ్లడం లేదన్నారు. పోలీసు శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు, ప్రజా సంఘాలు చైతన్యంతో ఉద్యమించి పార్టీలు తమ మేనిఫెస్టోలో పోలీసు సంస్కరణలకు ప్రాధాన్యం ఇచ్చేలా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన దుర్మార్గాలన్నింటిపైనా విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తెనాలిలో ముగ్గురు యువకులను పోలీసులు కొట్టడం చట్టవిరుద్ధమని, ప్రజాస్వామ్య పాలనలో ఇలాంటి చర్యలను అందరూ ఖండించాల్సిందేనన్నారు. సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, చైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ప్రొఫెసర్ డీఏఆర్ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :