Tuesday, 31 March 2026 04:31:37 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Chandrababu Naidu: "ఈయన దావోస్ మేన్"... జ్యూరిచ్ లో చంద్రబాబు గురించి కిశోర్ లుల్లా కామెంట్

Date : 19 January 2026 07:56 PM Views : 108

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : జ్యూరిచ్‌లో ఈరోస్ ఇన్నోవేషన్స్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ ఏపీని ఏఐ క్రియేటివ్ కంపెనీలకు హబ్‌గా మార్చడమే లక్ష్యం ఏఐ ఫిల్మ్ సిటీ, వర్చువల్ టూరిజం వంటి ప్రాజెక్టులపై చర్చ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రధాన దృష్టి ఆంధ్రప్రదేశ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత క్రియేటివ్ కంపెనీలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దావోస్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ వెళ్లిన ఆయన, ప్రముఖ సంస్థ ఈరోస్ ఇన్నోవేషన్స్ ప్రతినిధులతో జ్యూరిచ్‌లో సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఏఐ, డిజిటల్ కంటెంట్ రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు జరిగాయి. ఈరోస్ ఇన్నోవేషన్స్ ప్రతినిధులు కిశోర్ లుల్లా, రిధిమా లుల్లా, స్వనీత్ సింగ్‌లతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్దేశించి "ఈయన దావోస్ మేన్" అంటూ కిశోర్ లుల్లా పేర్కొనడం హైలైట్ గా నిలిచింది. రాష్ట్రంలో జనరేటివ్ ఏఐ ఆధారిత కార్యక్రమాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. రాష్ట్రానికి ప్రత్యేకమైన జెన్‌ఏఐ మోడల్, కంటెంట్ సూపర్ యాప్, విద్యా రంగంలో ఏఐ భాగస్వామ్యం, ఏఐ ఆధారిత ఫిల్మ్ సిటీ, వరల్డ్ క్లాస్ వర్చువల్ ప్రొడక్షన్ స్టూడియోలు వంటి పలు కీలక ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలిసింది. వీటితో పాటు ఏఐ క్రియేటివ్ టెక్ హబ్, 'డిస్కవర్ ఆంధ్రప్రదేశ్ 360' పేరుతో వర్చువల్ రియాలిటీ టూరిజం ప్రాజెక్టును కూడా చేపట్టాలని ప్రతిపాదించారు. ఈ కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ, డిజిటల్ కంటెంట్ ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ ప్రయత్నాలన్నీ రాష్ట్ర యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడంలో సహాయపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు (WEF-26) నేపథ్యంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :