Thursday, 12 March 2026 12:36:40 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Kalisetti Appalanaidu: బీఆర్ఎస్, వైసీపీల అజెండా ఒకటే: టీడీపీ ఎంపీ కలిశెట్టి

Date : 19 January 2026 06:47 PM Views : 57

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : బీఆర్ఎస్, వైసీపీలు కుమ్మక్కై చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నాయన్న కలిశెట్టి బెంగళూరులో కూర్చొని జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపణ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని వ్యాఖ్య బీఆర్‌ఎస్‌, వైసీపీ కుమ్మక్కై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నాయని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీల అజెండా ఒకటేనని, గోదావరి జలాల అంశాన్ని రాజకీయం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్‌ కోర్టుకు హాజరైనప్పుడు బీఆర్‌ఎస్‌ నేతలు ఫ్లెక్సీలు పెట్టి స్వాగతం పలకడం, అదే విధంగా కేటీఆర్‌ ఖమ్మం వెళ్లినప్పుడు వైసీపీ నేతలు ఫ్లెక్సీలు కట్టడం ఈ రెండు పార్టీల మధ్య ఉన్న అనుబంధాన్ని స్పష్టంగా చూపుతోందని ఆయన అన్నారు. స్నేహం పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం సరికాదని హెచ్చరించారు. జగన్‌ బెంగళూరులో కూర్చొని కుట్ర రాజకీయాలు చేస్తున్నారని, ఆ కుట్రల్లో బీఆర్‌ఎస్‌ నేతలు కూడా భాగస్వాములవుతున్నారని కలిశెట్టి అప్పలనాయుడు ఆరోపించారు. ఐదేళ్లు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ రాయలసీమకు ఒక్క పరిశ్రమైనా తీసుకువచ్చారా? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న సమయంలో ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా, సొంత వ్యాపారాలు, రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. ప్రజల అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతోందని... వైసీపీ రాజకీయ కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :