Tuesday, 31 March 2026 04:35:55 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్

Date : 07 February 2026 06:49 PM Views : 127

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : అమరావతి క్వాంటమ్ వ్యాలీకి శ్రీకారం టెక్ ప్రపంచంలో ఏపీ చారిత్రక అడుగు దేశంలోనే తొలి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు ప్రాజెక్టు కోసం 50 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం ఐబీఎం, టీసీఎస్, ఎల్&టీ వంటి దిగ్గజాల భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ, రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్ నిర్మాణానికి తొలి అడుగు పడింది. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో 'అమరావతి క్వాంటమ్ వ్యాలీ' (AQV) భవన నిర్మాణానికి శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కలిసి శంకుస్థాపన చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం 50 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో భాగంగా, భారతదేశంలోనే తొలి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్‌ను నెలకొల్పనున్నారు. ఈ ప్రాజెక్టులో ఐబీఎం (IBM), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సెన్ అండ్ టూబ్రో (L&T) వంటి దిగ్గజ సంస్థలు భాగస్వాములుగా వ్యవహరించనున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, "1990లలో భారత్‌ను ఐటీ లీడర్‌గా నిలబెట్టడంలో ముందున్నట్లే, ఇప్పుడు అమరావతి నుంచి దేశాన్ని క్వాంటమ్ లీడర్‌గా నిలబెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం" అని అన్నారు. బోస్టన్, సింగపూర్, షాంఘై వంటి గ్లోబల్ క్వాంటమ్ కేంద్రాల సరసన అమరావతిని నిలపాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, రక్షణ, వైద్యం, ఆర్థిక రంగాల్లో పరిశోధనలకు, ఆవిష్కరణలకు ఈ వ్యాలీ కేంద్రంగా మారనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 88,000 ఉద్యోగాలు సృష్టించవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం, ఈ ఏడాది ఆగస్టు నాటికి భవన నిర్మాణం పూర్తి చేసి, డిసెంబరు నాటికి క్వాంటమ్ కంప్యూటర్‌ను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :